మంత్రి శ్రీ నారా లోకేష్ ను కలిసిన శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు.*

0
498

 

రాష్ట్ర విద్యా, ఐటీ, హెచ్.ఆర్.డి మరియు ఆర్.టి.జి శాఖల మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారిని అమరావతి (ఉండవల్లి )లోని వారి స్వగృహం నందు శుక్రవారం ఉదయం శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 

 

ఈ సందర్భంగా శ్రీశైలం మండలంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ బిసి హాస్టల్, పాలిటెక్నిక్, ఐ.టి.ఐ కళాశాలల నందు హాస్టల్ వసతి, భోజన శాల, తరగతి గదుల మరమ్మత్తులు, మౌలిక వసతుల కల్పన, అంతర్గత రహదారుల నిర్మాణం, త్రాగునీటి సదుపాయం ఏర్పాటికై వినతి..

 

అలాగే శ్రీశైలం నియోజవర్గంలో యువ గళం పాదయాత్ర సందర్భంగా శ్రీ లోకేష్ గారు ఆనాడు ఇచ్చిన హామీ.. ప్రతి చెంచు కుటుంబానికి ఇళ్లు నిర్మించి అందించే అంశంపై కూడా ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మంత్రి శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశాలపై మంత్రి శ్రీ లోకేష్ గారు సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే గారి వెంట నియోజకవర్గ టిడిపి నాయకులు యుగంధర్ రెడ్డి ఉన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి నా అజెండా ఎర్రగడ్డ వెంకట్రావు
*గన్నవరం నియోజక వర్గ అభివృద్ధియే నా అజెండా: యార్లగడ్డ వెంకట్రావు*   గన్నవరం నియోజకవర్గ...
By Rajini Kumari 2026-01-04 11:12:58 0 196
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాకు అత్యాధునిక RACE కమ్యూనికేషన్ వాహనాలు.
అన్నమయ్య జిల్లాలో మారుమూల, సిగ్నల్ వ్యవస్థ లేని ప్రాంతాల్లో కమ్యూనికేషన్‌ను బలోపేతం...
By Pagadala Venkateswar 2026-01-20 06:23:14 0 139
Andhra Pradesh
మదనపల్లిలో టమాటా ధరలు పతనం.
మదనపల్లె మార్కెట్‌కు 391 మెట్రిక్ టన్నుల టమాటాలు ఆదివారం వచ్చాయి. గత 3 రోజులుగా టమాటా ధరలు...
By Pagadala Venkateswar 2026-05-11 06:14:19 0 65
Andhra Pradesh
సిటిఎం చెరువు గట్టున మృత శిశువు కలకలం.
మదనపల్లె మండలం సీటీఎం చెరువు గట్టు వద్ద బుధవారం ఒక బాలుడి మృతదేహం లభ్యం కావడంతో తీవ్ర కలకలం...
By Pagadala Venkateswar 2026-05-14 05:54:28 0 52
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com