విద్యాశాఖలో లోకేష్ అన్న విప్లవాత్మకమైన మార్పులు – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

0
11

విద్యాశాఖలో లోకేష్ అన్న విప్లవాత్మకమైన మార్పులు – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం, అగ్రహారం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు దాతల సహకారంతో 35 సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతూ, విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు అభినందనలు తెలిపారు. విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ, విద్యార్థులను ఉన్నత విలువలతో తీర్చిదిద్దుతున్నారని అన్నారు.

పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థినులకు అవసరమైన సైకిళ్లను పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ లక్ష్మీ తెలిపారు.

విద్యార్థినులకు 35 సైకిళ్లను దాతలు దేవినేని కోటేశ్వరరావు, కంచుమాటి శ్రీనివాసరావు, దిరిశాల శ్రీనివాసరావు, రాజా గార్లు అందించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీను, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సోమేపల్లి శ్రీను, మాజీ జడ్పీటీసీ కొక్కెర నాగరాజు, మండల టీడీపీ నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ప్రాణాలకు ప్రమాదంగా మారుతున్న ఈ LED లైట్లపై ప్రభుత్వం ఎప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుంది?
రోడ్లపై LED లైట్ల టార్చర్.. వాహనాలకు LED లైట్ల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని సోషల్...
By Ponnala Srinivasrao 2026-05-27 12:33:26 0 111
West Bengal
CM Suvendu Adhikari Begins Maiden North Bengal Tour
In his first official visit to North Bengal since taking oath as Chief Minister on May 9, Suvendu...
By Dunna Jessicaruth 2026-05-20 10:31:41 0 108
Telangana
గూడెంగుట్ట ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన : డిప్యూటీ సీఎం
మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ...
By Avunoori Mahesh 2026-06-13 11:12:42 0 195
Andhra Pradesh
పుంగనూరు: దాడి కేసులో నిందితులకు జైలు శిక్ష
పుంగనూరుకు చెందిన యేసు, మరో ఇద్దరికి మదనపల్లి కోర్టు మంగళవారం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష...
By Kothuru Murali 2026-04-08 07:48:32 0 124
Business & Finance
ESI Returns Ensure Employee Benefits Compliance
ESI Returns are essential for reporting employee insurance contributions to the Employees' State...
By Navya Sree 2026-07-22 05:02:39 0 24
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com