కనిగిరికి శాశ్వత త్రాగునీటి పరిష్కారమే లక్ష్యం ప్రజల దాహానికి శాశ్వత విముక్తి కోసం ఎమ్మెల్యే కృషి

0
13

కనిగిరికి శాశ్వత త్రాగునీటి పరిష్కారమే లక్ష్యం ప్రజల దాహానికి శాశ్వత విముక్తి కోసం ఎమ్మెల్యే కృషి

కనిగిరి నియోజకవర్గ ప్రజలను ఎన్నో సంవత్సరాలుగా వేధిస్తున్న త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనే సంకల్పంతో, రాబోయే కాలంలో నీటి కొరత మరింత తీవ్రమయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన గౌరవ కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు, ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారిని కలిసి ప్రత్యేక వినతిపత్రం సమర్పించారు.

ఒక్క బిందె మంచి నీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచే తల్లులు తాగునీటి కోసం గంటల తరబడి ఎదురు చూసే కుటుంబాలు ఫ్లోరైడ్ కలిసిన నీటిని తాగి ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న చిన్నారులు, వృద్ధులు. ఈ బాధలకు శాశ్వత ముగింపు పలకాలనే లక్ష్యంతో కనిగిరికి సమగ్ర తాగునీటి ప్రాజెక్టును మంజూరు చేయాలని మంత్రి గారిని ఎమ్మెల్యే గారు కోరారు.

తాగునీరు అనేది విలాసం కాదు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. కనిగిరి ప్రజలు ఇకపై నీటి కోసం ఇబ్బందులు పడకుండా, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు చేరేలా శాశ్వత పరిష్కారం తీసుకురావడమే నా ధ్యేయం అని గౌరవ ఎమ్మెల్యే శ్రీ డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు పేర్కొన్నారు.

ప్రజల దాహం తీరే వరకు కనిగిరికి శాశ్వత త్రాగునీటి పరిష్కారం వచ్చే వరకు తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని* ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Telangana
భూకబ్జాదారులకు బిగ్ షాక్.. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా విస్తరణ!
హైడ్రా కమీషనర్ ఏ.వి రంగనాథ్ తెలంగాణ రాష్ట్రంలో భూ ఆక్రమణలకు పాల్పడేవారికి, ముఖ్యంగా చెరువులు...
By Ponnala Srinivasrao 2026-05-08 00:46:48 0 137
Punjab
Tarn Taran Farmers’ Protest: Demand for Sugar Mill Revival
The farmers' agitation in Tarn Taran, spearheaded by the Sanyukt Kisan Morcha (SKM), has reached...
By Lokeshwari Panthadi 2026-06-29 08:58:19 0 78
Andhra Pradesh
వికసిద్భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ చైర్మన్ విలేకరుల సమావేశం
లంకా దినకర్, ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు ( వికసిత్ భారత్ - స్వర్ణాంధ్రప్రదేశ్ ) ఛైర్మెన్,...
By Rajini Kumari 2025-12-31 10:15:22 0 227
Andhra Pradesh
కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుక :
కర్నూలు సిటీ :  కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారి కార్యాలయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్...
By Hari Krishna 2026-01-23 14:16:27 0 198
Andhra Pradesh
Chandrababu Naidu: కేంద్ర నిధులపై సీఎం చంద్రబాబు ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.
కేంద్ర బడ్జెట్ 2026-27లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు, ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-02-13 06:53:52 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com