MLA ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలి

0
139

మహబూబాబాద్ :  బయ్యారం మండలంలో గిరిజనేతరులకు అన్యాయం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కు మెమోరండం ఇవ్వడంపై ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తీవ్రంగా ఖండిస్తుంది.

 ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసి రైతులు ఆదివాసీ యువతీ యువకులు నిరుద్యోగులు విద్యార్థులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో విచ్చలవిడిగా గిరిజనేతరుల వలసలు పెరిగి ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతరులు ఆర్థికంగా రాజకీయంగా తమ పలుకుబడిని పెంచుకొని ఆదివాసీ గూడలలో గిరిజనేతరులు ఎన్ని విధాలుగా ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారో తెలీదా... అని ప్రశ్నించారు.

ఆదివాసులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు చట్టాలకు ఇబ్బందులు తలపెడుతూ 5 వ షెడ్యూల్ ఏజెన్సీ చట్టాలను ఒక్కొకటిగా తీసివేయాలని గిరిజనేతరులు కంకణం కట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఆదివాసులు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు కనుగుమరుగైపోతున్నాయని తిరిగి 5 షెడ్యూల్ ఏజెన్సీ చట్టాలను హక్కులను జీవోలను తిరిగి అమలు అయ్యేలా నిత్యం ఆదివాసీ సంఘాలు ఆదివాసీ ప్రజలు పోరాటం దిశగా ప్రయాణం చేస్తుంటే ఒక ఆదివాసి ప్రజా ప్రతినిది అయిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదివాసీల పక్షాన కాకుండా గిరిజనేతరుల పక్షాన మాట్లాడంపై ఆదివాసులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే MLA ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బాధ్యత గల హోదాలో ఉండి ఇటువంటి చర్యలకు పాల్పడడం మనుకొని ఏజెన్సీ ప్రాంత  నిరుద్యోగులైన ఆదివాసీ యువతీ యువకుల కోసం జీవో నెంబర్ 03, ఐటీడీఏ లలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల గురించి, ఏజెన్సీ చట్టాలైన పేసా చట్టం,1/70 చట్టాల అమలుకోసం ఆదివాసీ రైతుల కోసం గిరివికాస ధ్వారా బోర్లు ఆదివాసి సమాజానికి ఉపయోగపడే సంక్షేమం కోసం ఆలోచన చేయాలని ST రిజర్వేషన్ ఉన్నది కాబట్టే ఈ రోజు ఎంతో మంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారని వివిధ రంగలలో రానిస్తున్నారని ఇట్టి విషయాన్ని గ్రహించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు సువర్ణపాక వెంకట రత్నం,తుడుందెబ్బ కొత్తగూడ, గంగారం మండల అధ్యక్షులు పూనేం సందీప్ కుమార్, ఈసం శ్యామ్ రావు, మండల ప్రధాన కార్యదర్శి తుడుం దెబ్బ నాయకులు సువర్ణపాక బాబీ, చుంచ శోభన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన ఇళ్లను కూల్చివేసిన హైడ్రా.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  గాజుల రామారంలో రూ.4500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి,...
By Sidhu Maroju 2025-09-21 09:22:15 0 297
Telangana
వెలుగుమట్ల భూదాన్ భూములపై ఖమ్మం జిల్లా కలెక్టర్ వివరణ
ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల అంశంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం వివరణ ఇచ్చారు....
By Krishna Balina 2026-02-26 12:09:34 0 355
Telangana
భద్రాచలంలో కొనసాగుతున్న బంద్: బస్టాండ్ వద్ద నిలిచిపోయిన రాకపోకలు
భద్రాచలం: రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపులో భాగంగా ఈరోజు భద్రాచలం పట్టణంలో బంద్ ప్రశాంతంగా, అయితే...
By Lakavath Kiran 2026-04-22 01:42:19 0 415
Telangana
Hearing on MLA Disqualification Petitions to Conclude Today
  ​Hyderabad: The hearing on the disqualification petitions filed against MLAs following...
By G k Nookala 2026-03-05 09:58:33 0 278
Andhra Pradesh
కోల్‌కతా వెళ్లిన నారా లోకేశ్... సీఎం సువేందు అధికారితో కీలక భేటీ.
  కోల్‌కతా వెళ్లిన నారా లోకేశ్... సీఎం సువేందు అధికారితో కీలక భేటీ   Andhra...
By Pagadala Venkateswar 2026-06-19 04:50:19 0 73
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com