Madanapalle: రామసముద్రంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. రూ. 11,200 నగదు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం. చట్టవిరుద్ధ పనులపై ఎస్సై హెచ్చరిక.

0
27

మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం మండల కేంద్రం శీతరగానిపల్లె సమీపంలో చెట్టు కింద పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం ఎస్సై హృషికేశవ రెడ్డి సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి నిర్వహించారు.

 

ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి రూ.11,200 నగదుతో పాటు 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హృషికేశవ రెడ్డి తెలిపారు.

 

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, చట్టవిరుద్ధమైన పేకాట, జూదం వంటి కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా పేకాట లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
ఇంటింటికీ ఎస్‌ఐఆర్.|
"వాసవీనగర్ తదితర కాలనీల్లో ఫారాల పంపిణీని పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి." మేడ్చల్...
By Sidhu Maroju 2026-06-30 08:00:40 0 64
Telangana
కేసీఆర్ సర్కారును మేమే కూల్చాం" బండి సంజయ్
పాపం బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు టెన్షన్‌లో నిజాలు అన్నీ చెప్పేస్తున్నాడు. ‎...
By Ponnala Srinivasrao 2026-05-21 11:39:30 0 110
Madhya Pradesh
Fatal Negligence at AIIMS Bhopal: 3-Year-Old Killed
A three-year-old boy undergoing leukemia treatment at AIIMS Bhopal died after nursing staff...
By Tejaswini Komanduru 2026-06-15 08:29:20 0 178
Andhra Pradesh
బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం కృషిచేసిన ఎర్రం నాయుడు
*ప్రచురణార్థం* *23-02-2026*     *బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన...
By Rajini Kumari 2026-02-23 10:33:02 0 163
Telangana
మొయినాబాద్ మున్సిపాల్టీ లో శ్రీరాముడి ఊరేగింపు వేడుకలు
హిమాయతనగర్ మున్సిపాల్టీ లో శ్రీరాముడి ఊరేగింపు ఘనంగా జరిగింది ఈ ఊరేగింపు లో కౌన్సిలర్లు పల్లగోల్ల...
By Veeresh Kumar 2026-03-27 15:05:14 0 395
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com