ఓటును రక్షించుకోవడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత

1
208

హుజూర్‌నగర్  / భారత్ అవాజ్ :

దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపట్టిన SIR (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును రక్షించుకునేందుకు తప్పనిసరిగా SIR ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత బూత్ లెవల్ అధికారి (BLO)కి అందజేయాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు.

హుజూర్ నగర్ 219 పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 70 శాతం SIR ఫారాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా ఫారాలు సమర్పించని ఓటర్లు ఆలస్యం చేయకుండా వెంటనే SIR ఫారాన్ని నింపి స్థానిక BLOకు అందజేసి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు.

 

ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ఆకుల రాము, యువ న్యాయవాది చిట్టిపోతుల రమేష్, BLO ఆకుల రజని, RP పులి సుధాలు 219 పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా SIR ప్రక్రియలో పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని వారు కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి: బొబ్బిలి ఎమ్మెల్యే
తెర్లాం మండలంలోని గోపాలవలస, జగన్నాథవలస, సతివాడ రోడ్లు దుర్భరంగా ఉన్నాయని వాటి నిర్మాణానికి నిధులు...
By Boiena Rajesh 2026-02-25 06:25:27 0 419
Andhra Pradesh
ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కోడుమూరు ఎమ్మెల్యే
కర్నూలు : కోడుమూరు : గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన కోడుమూరు ఎమ్మెల్యే :  ప్రజల నుండి...
By Hari Krishna 2026-01-23 06:48:42 0 174
Andhra Pradesh
స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం
స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా యర్రగొండపాలెం పట్టణంలోని ఉట్ల స్థంబాల వీధిలోని...
By Chennaiah Kati 2026-06-20 08:24:29 0 69
Telangana
తెలంగాణ : 1.28 లక్షల పెన్షన్లు రద్దు...!
తెలంగాణ రాష్ట్రంలో  1.28 లక్షల పెన్షన్లు రద్దయ్యాయి. ఇటీవల పెన్షన్ల వెరిఫికేషన్ చేపట్టి...
By Sunka Santhosh 2026-06-18 19:08:56 0 125
Bharat Aawaz
ప్రజాస్వామ్యమా? లంచస్వామ్యమా?
https://youtu.be/NPife2mtw9Q  
By BMA ADMIN 2025-08-20 10:06:54 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com