హరిబాబు కుటుంబం పై మురళి దాడి
Posted 2026-07-09 02:46:21
0
84
బాపట్ల జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు కుటుంబాల ఆధ్వర్యంలో పొంగళ్ల కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన వివాదం దాడికి దారితీసినట్లు సమాచారం.
వివరాలు:
బోయినవారిపాలెం గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న పొంగళ్ల కార్యక్రమం వద్దకు బోయిన హరిబాబు వెళ్లగా, బోయిన మురళి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి తనపై, తన తల్లిపై దాడి చేశారని హరిబాబు ఆరోపించారు. ఈ ఘటనలో తాము గాయపడినట్లు ఆయన తెలిపారు.
ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి, వాస్తవాలు నిర్ధారించిన అనంతరం కేసు నమోదు చేస్తామని తెలిపినట్లు బాధితులు వెల్లడించారు.పోలీసుల విచారణ అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Puducherry Strengthens Fiscal Management and Budget Reforms
Puducherry continues to focus on sound financial management through prudent fiscal policies,...
అసత్య ఆరోపణలుపై స్పందించిన జనసేన నేత మహేష్.
తనపై వస్తున్న ఆరోపణలపై జనసేన పార్టీ ఏపీఐఐసీ డైరెక్టర్ మై ఫోర్స్ మహేష్ ఆదివారం స్పందించారు. రాజకీయ...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
శ్రీ రామస్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలం పిఎన్ కాలనీ గ్రామం మిన్నం రెడ్డి...
పుంగనూరు నియోజకవర్గం:కల్లూరులో కాంట్రాక్ట్ టీచర్ అసభ్య ప్రవర్తన!
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్ గా...