నిజ‌మే, మెద‌డులో గుజ్జు ఉండాలి. హృద‌యం కూడా ఉండాలి. ఎవ‌రికి ఉంది ఎవ‌రికి లేదు అన్న ప్ర‌శ్న కాసేపు ప‌క్క‌న పెట్టండి. ముందుగా గోదావ‌రి నీళ్లు ఎత్తిపోయండి.

0
110

నిజ‌మే, మెద‌డులో గుజ్జు ఎవ‌రికి ఉంది?

‎నిజ‌మే, మెద‌డులో గుజ్జు ఉండాలి. హృద‌యం కూడా ఉండాలి. ఎవ‌రికి ఉంది ఎవ‌రికి లేదు అన్న ప్ర‌శ్న కాసేపు ప‌క్క‌న పెట్టండి. ముందుగా గోదావ‌రి నీళ్లు ఎత్తిపోయండి. ముఖ్య‌మంత్రి, నీటిపారుద‌ల మంత్రి క‌నీస అవ‌గాహ‌న లేకుండా ద‌బాయిస్తున్నారు. ఎల్‌నినో ప్ర‌భావం వ‌ల్ల ఈ ఏడాది క‌రువు వ‌స్తుంద‌ని ముఖ్య‌మంత్రి, నీటిపారుద‌ల మంత్రి అంగీక‌రిస్తున్నారు. గోదావ‌రికి పైనుంచి- అంటే శ్రీ‌రాంసాగ‌ర్ నుంచి వ‌ర‌ద వ‌చ్చే అవ‌కాశం లేదు అని కూడా వారికి తెలుసు. 

‎అయినా అదే నోటితో క‌న్నెప‌ల్లి నుంచి నీటిని ఎత్తిపోసి అన్నారం, సుందిళ్ల బ‌రాజుల‌ను నింపితే అవి కూలిపోతాయి, ఊళ్లు మునుగుతాయి, భ‌ద్రాచ‌లం కొట్టుకుపోతుంది అని భ‌య‌పెడుతున్నారు. చ‌రిత్ర‌లోనే క‌నీవినీ ఎరుగ‌ని విధంగా 20 ల‌క్ష‌ల క్యూసెక్కులకు పైగా వ‌ర‌ద వ‌చ్చిన 2022లోనే ఆ బ‌రాజుల‌కు ఏమీ కాలేదు, భ‌ద్రాచ‌లానికీ ఏమీ కాలేదు. అన్నారం, సుందిళ్ల బ‌రాజుల వ‌ద్ద కొన్ని బుంగలు ప‌డ‌డం, వాటిని గ్రౌటింగ్‌తో మ‌ర‌మ్మ‌తు చేయ‌డం ఎప్పుడో జ‌రిగిపోయింది.  

‎ఆ బ‌రాజుల‌ను కూడా పూర్తిస్థాయిలో నింపాల్సిన ప‌నిలేదు. స‌గం నీటి మ‌ట్టం నింపితే చాలు అటు అన్నారం, ఇటు సుందిళ్ల పంపు హౌజుల‌కు నీరు అందుతుంది. సునాయాసంగా నీటిని ఎల్లంప‌ల్లికి ఎత్తిపోయ‌వ‌చ్చు. ఎత్తిపోత‌ల నీటితో బ‌రాజుల‌పై ఒత్తిడి ప‌డి కూలిపోయే ప్ర‌మాదం ఏమీ లేదు. పైనుంచి పెద్ద మొత్తంలో వ‌ర‌ద వ‌స్తేనే బ‌రాజుల‌పై ఒత్తిడి ప‌డుతుంది. ఈ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి జాతీయ డ్యాముల భద్రతా ప్రాధికార సంస్థ ఎప్పుడో చేసిన ప్రకటనను ఒక సాకుగా చూపెడుతున్నది. బరాజుల్లో అటువంటి సమస్య ఉన్నట్టు గుర్తిస్తే మరమ్మతు చేయకుండా రెండున్నరేళ్లు ఎందుకు కాలక్షేపం చేసింది? 

‎వాస్త‌వం ఇలా ఉంటే మెద‌డులో గుజ్జు గురించి మాట్లాడ‌డం ఏంబాగుంటుంది? గుజ్జు ఎవ‌రికి ఉన్న‌ట్టు ఎవ‌రికి లేన‌ట్టు? హైదరాబాద్లో ఇప్పటికే నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పుడు నీటిని ఎత్తిపోయ‌క‌పోతే హైద‌రాబాద్ నీటి క‌ష్టాల‌కు, ఉత్త‌ర తెలంగాణ ప్ర‌జ‌ల క‌రువు క‌ష్టాల‌కు ముఖ్య‌మంత్రి, నీటిపారుద‌ల మంత్రి ఇద్ద‌రూ బాధ్య‌త వ‌హించ‌వ‌ల‌సి ఉంటుంది.  

‎కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ కాదు. ఎల్లంపల్లి నుంచి బస్వాపురం దాకా నిర్మించిన రిజర్వాయర్లు కూడా అందులో భాగమే. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు లో 60 టీయెంసీల నిల్వ సామర్థ్యం రూపకల్పన చేస్తే, కాళేశ్వరం ప్రాజెక్టులో 150 టీయెంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్లను నిర్మించారు. అవి ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. రెండున్నరేళ్లు బద్నాం గేముతో కాలక్షేపం చేశారు. ఇక చాలు. మేడిగడ్డ బరాజుకు మరమ్మతు పూర్తిచేయండి. ఈ సమస్యను ఇంకా సాగదీస్తే తెలంగాణ ప్రజలముందు మీరు దోషులుగా మిగులుతారు.

‎ఈ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి జాతీయ డ్యాముల భద్రతా ప్రాధికార సంస్థ ఎప్పుడో చేసిన ప్రకటనను ఒక సాకుగా చూపెడుతున్నది. బరాజుల్లో అటువంటి సమస్య ఉన్నట్టు గుర్తిస్తే మరమ్మతు చేయకుండా రెండున్నరేళ్లు ఎందుకు కాలక్షేపం చేసింది? 

Search
Categories
Read More
Andhra Pradesh
యువనేత లోకేష్ సారధ్యంలో విప్లవాత్మక సంస్కరణలు
*యువనేత లోకేష్ సారథ్యంలో విప్లవాత్మక సంస్కరణలు*   *ఏపీలో విద్యావ్యవస్థను నెం.1గా...
By Rajini Kumari 2025-12-31 10:08:51 0 210
Andhra Pradesh
చేతబడి నెపంతో హత్య చేసిన నిందితుల అరెస్ట్
పార్వతీపురం(M) వెలగవలస గ్రామానికి చెందిన తాడంగి రమేశ్ను చేతబడి నెపంతో గ్రామానికి చెందిన కొందరు...
By Boiena Rajesh 2026-06-03 02:02:38 0 179
Andhra Pradesh
గ్రామీణ ప్రాంతాల్లో "రీసర్వే "రైతులకు అవగాహన సదస్సు
తిరుపతి:-తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం గ్రామ పంచాయతీ కాలూరు రెవెన్యూ విలేజ్ పరిధిలోని ఉన్న...
By Karapati Gopi 2025-12-31 07:01:34 0 1K
Telangana
బాచుపల్లి అగ్ని ప్రమాదం
Quthbullapur Fire Accident: మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళ భారీ...
By Ponnala Srinivasrao 2026-03-13 06:24:21 0 272
Bihar
Mining Jackpot: Rare Minerals Found in Banka & Bhagalpur
Bihar is emerging as a massive hotspot on India’s mineral map. The state government...
By Dunna Jessicaruth 2026-05-21 05:27:41 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com