432 రైతులకు భూహక్కుల పాస్ పుస్తకాలు ఎమ్మెల్యే సౌమ్య పంపిణీ

0
92

'మీ భూమి – మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

 

నందిగామ, జూలై 6 భారత్ అవాజ్ :

నందిగామ మండలం లాచపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన 'మీ భూమి – మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రీసర్వే ప్రక్రియ పూర్తయిన అనంతరం 432 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన భూ హక్కుల పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య రైతులకు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమం, భూ హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.రీసర్వే ప్రక్రియ ద్వారా భూ యాజమాన్యానికి సంబంధించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, రైతులకు తమ భూములపై స్పష్టమైన హక్కులు, పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

భూ హక్కుల పాస్ పుస్తకాలు అందుకున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ, పారదర్శకంగా రీసర్వే నిర్వహించి తక్కువ సమయంలో పాస్ పుస్తకాలు అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామస్థులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Jharkhand
Jharkhand Expands Renewable Energy for Sustainable Growth
Jharkhand has continued to advance its renewable energy sector in 2026 by promoting solar power...
By Fathima Safa 2026-07-01 09:57:39 0 53
Business & Finance
Airport City Project Boosts Bengaluru Investment
Prestige Group is advancing its ₹1,800-crore integrated Airport City project in Bengaluru. The...
By Navya Sree 2026-06-30 07:44:39 0 85
Business & Finance
Credit Score Check for Better Loan Eligibility Today
A credit score check helps you understand your financial health and borrowing eligibility before...
By Navya Sree 2026-07-23 05:58:15 0 20
Andhra Pradesh
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందిన మఠం రాజశేఖర్ స్వామి
నందవరం మండలం పులచింత గ్రామం నుండి మఠం రాజశేఖర్ స్వామి పట్టా పొందడం చాలా సంతోషదగ్గ విషయం వారు...
By Boya Dasthagiri 2026-04-28 13:19:36 0 157
Telangana
అడవి తల్లి దీవెన.... గుంజేడు ముసలమ్మ జాతర!
ఈ జాతర కేవలం మొక్కుల పండుగే కాదు. గిరిజన సంస్కృతికి అద్దం పట్టే వేదిక ఈనెల 4 నుండి గుంజేడులో...
By Bheeshman King 2026-03-02 04:08:01 0 4K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com