₹50 లక్షల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎం.పి

0
1K

 

 

 కంటోన్మెంట్ వార్డు 5 జ్యోతి కాలనీలో 50 లక్షల రూపాయలతో చేపట్టిన నీటి సరఫరా పైపు లైన్ పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ స్థానిక యంపీ ఈటెల రాజేందర్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి భానుక నర్మద మల్లికార్జున్ గార్లతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని, నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి గారితో, ఉన్నతాధికారులతో మాట్లాడి 5.9 యం జి డి ఉన్న నీటి సరఫరాను 1 యం జి డి పెంచి 6.9 యం జి డి చేపించానని,ఆ నీటి నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్లు కూడా గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సరిపడా లేకపోవడంతో ఇటీవల వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి గారిని స్వయంగా కంటోన్మెంట్ బోర్డు కార్యాలయానికి ఆహ్వానించి బోర్డు CEO గారు మరియు ఇతర అధికారులతో సమావేశం ఏర్పాటు చేయించి రిజర్వాయర్ల నిర్మాణానికి కూడా ప్రత్యేక నిధులు తీసుకు వచ్చి పూర్తి చేయించడానికి కృషి చేస్తున్నానని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు ఉన్నారు.

Search
Categories
Read More
Sports
భారత్-జింబాబ్వే మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా
టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026) సూపర్-8లో భాగంగా ఇవాళ(గురువారం) రెండు కీలక మ్యాచ్‌లు...
By Benguluri Madhubabu 2026-02-26 10:37:19 0 174
Telangana
బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ
బస్ పాస్ ధరలను 20% పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సామాన్య ప్రజలతో పాటు,...
By Sidhu Maroju 2025-06-09 10:35:07 0 1K
Andhra Pradesh
పుంగనూరు:బోయకొండ ఆలయానికి హుండీ ద్వారా 35 లక్షల ఆదాయం: ఈవో
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు...
By Kothuru Murali 2026-03-27 14:26:54 0 124
Telangana
'టీం ఇండియా' అని పిలవొద్దా: సుప్రీం కోర్టు ఇచ్చిన షాకింగ్ రిప్లై ఇదే.|
హైదరాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి)   'టీం ఇండియా' ఈ పేరుపై దాఖలైన ఓ పిటిషన్ పట్ల సుప్రీం...
By Sidhu Maroju 2026-01-22 08:32:41 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com