₹50 లక్షల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎం.పి

0
1K

 

 

 కంటోన్మెంట్ వార్డు 5 జ్యోతి కాలనీలో 50 లక్షల రూపాయలతో చేపట్టిన నీటి సరఫరా పైపు లైన్ పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ స్థానిక యంపీ ఈటెల రాజేందర్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి భానుక నర్మద మల్లికార్జున్ గార్లతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని, నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి గారితో, ఉన్నతాధికారులతో మాట్లాడి 5.9 యం జి డి ఉన్న నీటి సరఫరాను 1 యం జి డి పెంచి 6.9 యం జి డి చేపించానని,ఆ నీటి నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్లు కూడా గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సరిపడా లేకపోవడంతో ఇటీవల వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి గారిని స్వయంగా కంటోన్మెంట్ బోర్డు కార్యాలయానికి ఆహ్వానించి బోర్డు CEO గారు మరియు ఇతర అధికారులతో సమావేశం ఏర్పాటు చేయించి రిజర్వాయర్ల నిర్మాణానికి కూడా ప్రత్యేక నిధులు తీసుకు వచ్చి పూర్తి చేయించడానికి కృషి చేస్తున్నానని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గాలివీడు మండలంలో మహాభారత యజ్ఞాన్ని ప్రారంభించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం నూరివీడు గ్రామం నాగూరి వాడపల్లి వద్ద 18 రోజులు జరగనున్న మహాభారత...
By Benguluri Madhubabu 2026-04-06 11:46:49 0 178
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు – జిల్లా ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల...
By Pagadala Venkateswar 2026-02-02 12:24:16 0 111
Andhra Pradesh
ఆక్సిడెంట్ లో ఇద్దరు మృతి
శుక్రవారం రాత్రి పుంగనూరు నూతన బైపాస్ జే–టోన్ మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....
By Kothuru Murali 2026-01-03 11:18:46 0 160
Telangana
తెలంగాణ ఏర్పాటు మీకు ఇష్టం లేనప్పుడు తెలంగాణ ఓట్లు ఎందుకు ?తెలంగాణలో అధికారం ఎందుకు ?
ఈటల రాజేందర్ గారు.... మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఉద్యమం చేసి ఆనాటి కేసిఆర్ ప్రభుత్వంలో...
By Ponnala Srinivasrao 2026-05-10 02:08:41 0 83
Telangana
ములుగు వరుస తవ్వకాల్లో పురాతన ఆలయ ఆనవాళ్లు భూగర్భం నుంచి ఆకస్మాత్తుగా వచ్చిన నాగుపాములు......
ములుగు వర్సిటీ తవ్వకాల్లో పురాతన ఆలయ ఆనవాళ్లు... భూగర్భం నుంచి అకస్మాత్తుగా వచ్చిన నాగుపాములు......
By Gujile Ramu 2026-05-15 08:34:06 0 56
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com