₹50 లక్షల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎం.పి

0
1K

 

 

 కంటోన్మెంట్ వార్డు 5 జ్యోతి కాలనీలో 50 లక్షల రూపాయలతో చేపట్టిన నీటి సరఫరా పైపు లైన్ పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ స్థానిక యంపీ ఈటెల రాజేందర్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి భానుక నర్మద మల్లికార్జున్ గార్లతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని, నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి గారితో, ఉన్నతాధికారులతో మాట్లాడి 5.9 యం జి డి ఉన్న నీటి సరఫరాను 1 యం జి డి పెంచి 6.9 యం జి డి చేపించానని,ఆ నీటి నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్లు కూడా గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సరిపడా లేకపోవడంతో ఇటీవల వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి గారిని స్వయంగా కంటోన్మెంట్ బోర్డు కార్యాలయానికి ఆహ్వానించి బోర్డు CEO గారు మరియు ఇతర అధికారులతో సమావేశం ఏర్పాటు చేయించి రిజర్వాయర్ల నిర్మాణానికి కూడా ప్రత్యేక నిధులు తీసుకు వచ్చి పూర్తి చేయించడానికి కృషి చేస్తున్నానని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయం
వ్యక్తి అదృశ్యం 17 9 20 25వ తేదీన తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయం నుండి మాదినేని విజయ్...
By mahaboob basha 2025-09-19 14:21:33 0 122
Jharkhand
Jharkhand Coal Minister Announces Wage & Safety Reforms for Workers
The #CoalMinister in #Jharkhand announced improved wages and working conditions for coal...
By Pooja Patil 2025-09-13 11:38:14 0 73
Telangana
తెలంగాణ పర్యాటక రంగం: ₹15,000 కోట్ల పెట్టుబడులతో కొత్త ప్రణాళిక విడుదల
సరికొత్త విధానం: తెలంగాణ ప్రభుత్వం 2025-2030 పర్యాటక అభివృద్ధి విధానాన్ని ప్రారంభించింది.భారీ...
By Triveni Yarragadda 2025-08-11 14:18:05 0 747
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com