భూ సమస్యల పరిష్కారానికే రీ సర్వే

0
72

జిల్లా భూకొలతల సర్వే ల్యాండ్ సహాయ సంచాలకులు సి.హెచ్ శ్రీనివాసులు                                                                                                                                                                                                                  

మహబూబాబాద్, జూలై.03:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే (భూ భారతి) ప్రక్రియపై జిల్లావ్యాప్తంగా  పలు మండలాల్లో అధికారులు ప్రజలకు మరియు రైతులకు అవగాహన సదస్సులు (గ్రామసభలు) నిర్వహిస్తున్నారని, ఎంతో కాలంగా నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూముల రీ సర్వే కార్యక్రమం చేపట్టిందని జిల్లా భూకొలతల సర్వే ల్యాండ్ సహాయ సంచాలకులు సి.హెచ్ శ్రీనివాసులు తెలిపారు. 

దీనిలో భాగంగా శుక్రవారం జిల్లా లోని వివిధ మండలాలలో  భూ భారతి - భూముల రీ సర్వేపై అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రభుత్వం   జిల్లాలో 70 గ్రామాలు రీ సర్వే జరుపుటకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని దానిలో భాగంగా రీ సర్వే పై అవగాహన కల్పించుటకు గ్రామ సభలు నిర్వహించుట జరుగుతుందని అన్నారు.

  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రీ సర్వే ద్వారా ప్రతి రైతుకు సర్వే నెంబర్ నమోదుచేసి (land parcel map), భూమి కమతాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తామని, గతంలో జరిగిన సర్వేలో తప్పులు జరిగి ఉంటే రీ సర్వేలో సరిచేసుకోవచ్చని ఎలాంటి వివాదాలు లేకుండా చేసి భూమికి భూధార్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

సర్వేనిర్వహించే తేదీల్లో రైతులు అందుబాటులో ఉండి ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞ ప్తి చేశారు. రీ సర్వే ద్వారా గ్రామ, భూ సరిహద్దులు, ప్రభుత్వ భూములు, చెరువులు, కాల్వలు, రహదారులతో పాటు ఇతర ప్రజా అవసరాల భూములను కచ్చితంగా రీ సర్వే చేయను న్నట్లు తెలిపారు. రీ సర్వే కార్యక్రమం ప్రజలకు మెరుగైన భూ హక్కులను కల్పించేందుకు ఉద్దేశించిందని  ప్రజల సహకారం తప్పనిసరి అని అధికారులు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
స్వర్ణం వార్డు-స్వర్ణ సచివాలయాలు
ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయా పేరు ను అధికారికంగా మార్చింది.ఇక నుంచి స్వర్ణ...
By Karapati Gopi 2025-12-30 01:02:52 0 291
Andhra Pradesh
సంక్రాంతి పండుగ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే 11 స్పెషల్ ట్రైన్స్
సంక్రాంతికి పాట్నాలో నుంచి విలెజ్ లకు వేళ్ళే ప్రయాణికులను దృష్టి లో పెట్టుకొని మరో 11స్పెషల్...
By Karapati Gopi 2025-12-30 10:25:37 0 614
Karnataka
Karnataka Strengthens Women’s Empowerment Initiatives
Karnataka continues to advance women’s empowerment and social welfare in 2026 by expanding...
By Fathima Safa 2026-07-04 12:38:01 0 90
Andhra Pradesh
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు...రౌడీ షీటర్లకు ముద్దనూరు సి.ఐ స్ట్రాంగ్ వార్నింగ్
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు...రౌడీ షీటర్లకు ముద్దనూరు సి.ఐ స్ట్రాంగ్...
By Chennaiah Kati 2026-07-05 14:27:06 1 61
Telangana
నిజామాబాద్
ఈ రోజు శని అమావాస్య సందర్భంగా ఇందూర్ నగర ఎమ్మెల్యే శ్రీ ధన్‌పాల్ సూర్యనారాయణ గారు జహీరాబాద్...
By Sadaq Sadaq 2026-05-16 17:02:55 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com