మురుగునీటి సమస్యపై మాజీ కార్పొరేటర్ పరిశీలన.|

0
90

"ఫిర్యాదు అందడంతో క్షేత్రస్థాయిలో తనిఖీ"

మేడ్చల్ మల్కాజిగిరి: అల్వాల్ కార్పొరేషన్ పరిధిలోని  హరిజన్‌బస్తీలో మురుగునీటి లైన్ బ్లాకేజీ కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఫిర్యాదు అందడంతో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మేనేజర్ రమేష్, పోచయ్య, రాజేందర్, ప్రశాంత్‌తో కలిసి బాధిత ప్రాంతాన్ని పరిశీలించిన ఆమె, మురుగునీటి ప్రవాహానికి అంతరాయం కలగకుండా పూర్తిస్థాయిలో డీసిల్టింగ్ పనులు చేపట్టి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మురుగునీటి వ్యవస్థను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను మాజీ కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో మహేష్, అంజయ్య, వెంకటమ్మ, హరి తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
డిల్లీ కి డోమ్... శత్రువుల గుండెల్లో రైళ్లు...
డిల్లీ రక్షణ కోసం కేంద్రం క్యాపిటల్ డోమ్ పేరు తో రక్షణ కవచాన్ని నిర్మించుకుంటుంది. శత్రువుల...
By Karapati Gopi 2025-12-28 03:25:49 0 396
Telangana
పెద్దపల్లిలో ఈనెల 19న జాబ్ మేళా....!
పెద్దపెల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఫైనాన్స్ కంపెనీలో ఉపాధి కల్పించుటకు ఈనెల 19న పెద్దపల్లిలో...
By Sunka Santhosh 2026-06-16 19:27:35 0 87
Andhra Pradesh
కమర్షియల్ సిలిండర్ ధర పెంపు
కొత్త సంవత్సరం లో ఆయిల్ కంపెనీలు ఎల్.పి. జి సిలిండర్లు రెట్లు ను పెంచాయి 19కేజిల కమర్షియల్...
By Karapati Gopi 2026-01-01 11:10:00 0 690
Telangana
నర్సంపేట పట్టణం రేపు బందుకు పిలుపునిస్తుంది
నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గారు  ఆత్మ ...
By Gujile Ramu 2026-04-23 16:05:54 0 217
Telangana
ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం- ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్: ప్రజల ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని...
By Sidhu Maroju 2026-03-29 07:00:14 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com