ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం

0
70

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం

పెద్దారవీడు మండలం, సుంకేసుల గ్రామంలో వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు రూ.300 కోట్ల ఆర్ & ఆర్ పరిహారం విడుదల చేసిన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి గూడూరి ఎరిక్షన్ బాబు గారు, మహిళలు, కూటమి నాయకులు, నిర్వాసితులు, అభిమానులు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు మాట్లాడుతూ...

"వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే రూ.300 కోట్ల పరిహారాన్ని విడుదల చేసి నిర్వాసితుల పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించారు. మిగిలిన అర్హులైన లబ్ధిదారులకు కూడా వచ్చే జులై, ఆగస్టు నెలలలో మరో రూ.600 కోట్ల పరిహారం విడుదల చేసి, అందరికీ న్యాయం చేస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది.

ప్రతి నిర్వాసిత కుటుంబం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో సొంత ఇంటిని నిర్మించుకుని గౌరవప్రదమైన జీవితం ప్రారంభించుకోవాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే ప్రాజెక్టులో నీటి విడుదల జరిగి లక్షల ఎకరాలకు సాగునీరు ప్రజలకు త్రాగు నీరు అందే చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతుందని తెలిపారు.

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల కలను సాకారం చేయడంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చారిత్రాత్మకమని, నిర్వాసితులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని ఎరిక్షన్ బాబు గారు అన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దారవీడు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, సుంకేసుల గ్రామ నిర్వాసితులు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నెల్లూరు మున్సిపల్ కార్మికుల అమానుష అరెస్టులను నిరసనగలం విప్పిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు
*నెల్లూరు మున్సిపల్ కార్మికులపై పోలీసుల అమానుష లాఠీచార్జికి, కార్మికుల అక్రమ*  *అరెస్టు లను...
By Rajini Kumari 2025-12-19 11:46:16 0 227
Business & Finance
West Bengal Intensifies Efforts to Attract Fresh Investments
West Bengal Intensifies Efforts to Attract Fresh Investments West Bengal has stepped up its...
By Navya Sree 2026-07-04 06:34:53 0 27
SURAKSHA
స్పందన కార్యక్రమం - ప్రజా సమస్యల పరిష్కారం
ప్రతి సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహించే 'స్పందన' కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులను...
By Kalaga Sailaja 2026-06-29 07:31:21 0 36
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: అడవికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
సోమల మండలం, అడుసుపల్లి గ్రామ సమీపంలోని అడవికి మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు...
By Kothuru Murali 2026-03-04 06:53:12 0 149
Business & Finance
Trademark Objection Response Protects Brand Rights
A Trademark Objection Response helps address concerns raised by the Trademark Registry during the...
By Navya Sree 2026-07-22 05:44:27 0 23
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com