కొమురం భీమ్ చౌక్ వద్ద తప్పిన ప్రమాదం. రంగంలోకి మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు

0
129

🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కొమురం భీమ్ చౌక్ వద్ద ఒక పెద్ద విద్యుత్ ప్రమాదం తృటిలో తప్పింది. కొమురం భీమ్ జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు ఉన్న ప్రధాన రహదారి డివైడర్ స్ట్రీట్ లైట్ల కనెక్షన్ వైరు ప్రమాదకరంగా డ్యామేజ్ కావడాన్ని గమనించిన స్థానికులు, వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. దీనిపై తక్షణమే స్పందించిన మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ ఎండి అహ్మద్, మరియు మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు మున్సిపల్ విద్యుత్ సిబ్బందితో పాటు విద్యుత్ విభాగం అధికారులను, సిబ్బందిని వెంటనే రంగంలోకి దించారు. అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో విద్యుత్ శాఖ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పనిచేసి, డ్యామేజ్ అయిన విద్యుత్ వైరుకు తక్షణమే మరమ్మత్తులు పూర్తి చేసి పెద్ద ప్రమాదాన్ని అడ్డుకున్నారు. మున్సిపల్ మరియు విద్యుత్ యంత్రాంగం ఇంత వేగంగా స్పందించి ముప్పు తప్పించడం పట్ల ఆసిఫాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ బాలకృష్ణ, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: రైతులు సబ్సిడీ పొందవచ్చు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో బంతి, చామంతి, రోజా వంటి విడిపూల సాగులో ధరలు పడిపోవడంతో రైతులు...
By Kothuru Murali 2026-01-20 14:55:49 0 177
Bihar
Bihar Teacher Transfer Rules 2026: A Reformist Approach
The Bihar government has approved the landmark Bihar State Teacher Transfer Rules 2026, marking a...
By Lokeshwari Panthadi 2026-06-26 12:53:29 0 93
Andhra Pradesh
నెల్లూరు మహానాడు ఏర్పాట్లపై కీలక సమావేశానికి హాజరైన మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పార్థసారధి గారు తిరుపతి ఎయిర్పోర్టులో గనస్పాగతం
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం కిసాన్ సేస్ వద్ద ఈనెల 27 28 29 తేదీల్లో...
By Benguluri Madhubabu 2026-05-13 06:22:26 0 216
Andhra Pradesh
పుంగనూరు: అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు
అన్నమయ్య జిల్లా పుంగనూరు పోలీస్ స్టేషన్ ఆవరణంలో సోమవారం మధ్యాహ్నం నక్కబండ, జగనన్న కాలనీ ప్రజలకు...
By Kothuru Murali 2026-03-24 08:09:07 0 153
Telangana
పేకాట స్థావరంపై ఎస్ఓటి పోలీసులు దాడులు: ఏడుగురు నిందితుల అరెస్టు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ఆల్వాల్ పిఎస్ పరిధిలోని పంచశీల కాలనీలోని ఓ ఇంట్లో పేకాట...
By Sidhu Maroju 2025-10-14 13:01:06 0 265
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com