పోలియో రహిత సమాజమే మా లక్ష్యం

0
58

పోలియో రహిత సమాజమే మన లక్ష్యం..

ఈరోజు తర్లుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎమ్. విజయ సునీత గారితో కలిసి అత్యంత ప్రతిష్టాత్మకమైన "పల్స్ పోలియో డ్రైవ్" కార్యక్రమాన్ని ప్రారంభించి, చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది.

మన కూటమి ప్రభుత్వం చిన్న పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. చిన్నారులను పోలియో మహమ్మారి బారిన పడకుండా రక్షించడానికి ఈ ముందు జాగ్రత్త చర్య ఎంతగానో ఉపకరిస్తుంది. మార్కాపురం జిల్లావ్యాప్తంగా ఈరోజు సుమారు 1,05,000 మంది చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోంది.

ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి చిన్నారికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారి భవిష్యత్తుకు ఆరోగ్య రక్షణ కల్పించాల్సిందిగా తల్లిదండ్రులందరినీ కోరుతున్నాను. మన కూటమి శ్రేణులు, నాయకులు మరియు కార్యకర్తలు స్థానికంగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాను.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్ దంప‌తులు.
స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన లోకేశ్‌ శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని...
By Pagadala Venkateswar 2026-03-03 09:39:07 0 157
Chandigarh
City That Never Sleeps: Chandigarh Embraces 24/7 Night Life
Chandigarh’s commercial landscape is undergoing a massive transformation. Once known for...
By Dunna Jessicaruth 2026-05-20 06:48:56 0 74
Andhra Pradesh
డోన్ లో ఏసీబీ దాడులు !!
కర్నూలు : నంద్యాల జిల్లా డోన్ (ద్రోణాచలం) సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు...
By Hari Krishna 2025-12-22 08:12:23 0 231
Telangana
"తెలంగాణలో కొత్త పార్కింగ్ షాక్.. అడ్డగోలుగా పార్క్ చేస్తే బండి వేలానికే!
హైదరాబాద్ : తెలంగాణ రవాణా శాఖ రాష్ట్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను అదుపు...
By Sidhu Maroju 2026-05-14 06:18:45 0 238
SURAKSHA
సైబర్ నేరగాళ్లకు చెక్: తెలంగాణ పోలీసుల కొత్త వ్యూహం
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోతున్న రోజులివి. ఇలాంటి డిజిటల్ దొంగల ఆట...
By Kalaga Sailaja 2026-06-25 07:48:36 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com