డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా పనిచేయాలి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ పిలుపు

0
148

🎤 కొమురం భీం ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్, 

ఆసిఫాబాద్: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసిఫాబాద్ పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతు. డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, ప్రతి ఒక్కరూ వాటికి దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాల దశ నుంచే విద్యార్థులు క్రమశిక్షణ, మంచి విలువలు అలవర్చుకొని, మాదకద్రవ్యాలు మరియు ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, డ్రగ్స్ వినియోగం మరియు అక్రమ రవాణాను అరికట్టేందుకు సమాజాన్ని చైతన్యపరచడం, యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచే సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి 2K రన్  ఈ 2K రన్ కార్యక్రమం ఆసిఫాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి గాంధీ చౌక్ మీదుగా అంబేద్కర్ చౌక్ నుండి తిరిగి పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు ఉత్సాహంగా కొనసాగింది. వాల్ ఆఫ్ ప్రామిస్ పై సంతకాలు, అనంతరం ఏర్పాటు చేసిన వాల్ ఆఫ్ ప్రామిస్  పై జిల్లా ఎస్పీ, పోలీస్ అధికారులు, విద్యార్థులు డ్రగ్స్ నిరోధక సందేశాలు రాసి, సంతకాలు చేసి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తమ మద్దతు ప్రకటించారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రజలు, విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు మరియు సమాజంలోని ప్రతి వర్గం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

Search
Categories
Read More
Telangana
మే 2 నుంచి మొక్కజొన్న కొనుగోలు తాత్యలిక నిలిపివేత...
నర్సంపేట మార్కెట్ యార్డుకు మక్కజొన్నలు తీసుకురావొద్దుయార్డులో 1.30 లక్షల బస్తాలు నిల్వ, స్థలం...
By Gujile Ramu 2026-04-30 13:46:16 0 210
Uttar Pradesh
Varanasi's Global Leap: First Major Biscuit Export to Oman
In a historic milestone for Uttar Pradesh’s food processing sector, Varanasi has...
By Lokeshwari Panthadi 2026-06-29 08:34:49 0 82
Karnataka
Karnataka Power Sector: Cabinet to Decide on Privatization
Deputy Chief Minister D.K. Shivakumar recently addressed escalating public and political...
By Lokeshwari Panthadi 2026-06-30 09:09:34 0 45
Andhra Pradesh
దర్శి 19వ వార్డ్ అభివృద్ధికి మరో ముందడుగు 🏗️
దర్శి 19వ వార్డ్ అభివృద్ధికి మరో ముందడుగు 🏗️ దర్శి పట్టణం 19వ వార్డ్‌లో రూ.51.50 లక్షల...
By Chennaiah Kati 2026-07-04 14:33:01 0 54
Andhra Pradesh
మార్కాపురం జిల్లా. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పెద్ద దోర్నాల మండలం పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం
మార్కాపురం జిల్లా. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పెద్ద దోర్నాల మండలం పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు...
By Chennaiah Kati 2026-03-04 07:40:01 0 453
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com