ఓటరు సవరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకాష్

0
127

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్: పట్టణంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్, హడుకో కాలనీలలో మున్సిపల్ బృందం, బూత్ స్థాయి సిబ్బందితో కలిసి వారు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, పొరపాట్లకు తావులేకుండా అర్హుల పేర్లను చేర్చాలని, ఎవరి పేర్లూ అనవసరంగా తొలగించబడకుండా చూసే బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమైన ఆయుధమని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో రాజకీయ శ్రేణులు, సామాజిక కార్యకర్తలు చొరవ చూపాలని కోరారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో స్థానిక కౌన్సిలర్లు చిలువేరు వెంకటేశ్వర్లు, సాలం బిన్ అహ్మద్, బాలకృష్ణలతో పాటు వార్డు అధికారి మానుష, బీఆర్ఎస్ నాయకులు అశోక్, సాయి, బూత్ స్థాయి సిబ్బంది లక్ష్మి, భాగ్యలక్ష్మి మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
rakshak Program by Goa Police Protects Elderly Living Alone Daily
Goa Police runs ‘Rakshak’ program for senior citizens living alone. Beat officers...
By Kalaga Sailaja 2026-07-03 06:01:53 0 27
Business & Finance
Grow Your Business with MSME Registration
Register your MSME online with expert assistance and unlock exclusive government benefits for...
By Navya Sree 2026-07-08 13:10:32 0 72
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలోని బోయ వాల్మీకి విద్యార్థులకు ప్రతిభను సాధించినందుకు పురస్కారాలు అందించడం జరిగింది
నందవరం మండల కేంద్రంలోని బోయ వాల్మీకి పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభను సాధించినటువంటి వాల్మీకి...
By Boya Dasthagiri 2026-06-07 13:17:20 0 174
Andhra Pradesh
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం ఘనంగా జరిగింది
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి,...
By Chennaiah Kati 2026-06-18 13:53:48 0 65
Andhra Pradesh
గౌరవ ఏపీ ఈగల్ చీఫ్ ఐజిపి శ్రీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ గారు గారు మాదకద్రవ్యాల అవగాహన కార్యక్రమం చేపట్టారు.
 తేది*: 30-12-2025 📍*స్థలం*: అరండలపేట పిఎస్ లిమిట్స్, గుంటూరు *గౌరవ ఏపీ ఈగల్ చీఫ్, ఐజిపి...
By KOTESWARARAO KVSR 2025-12-30 13:04:17 0 546
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com