యోగా నాకు చాలా ఇచ్చింది: డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

0
60

 

యోగా నాకు చాలా ఇచ్చింది: డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌

 

Andhra

Pawan Kalyan says Yoga gave me a lot

యోగతోనే తనకు లోతైన స్పష్టత, పరిపక్వత లభించాయని చెప్పిన పవన్ కల్యాణ్

తన దినచర్యలో క్రియ యోగ, అష్టాంగ యోగ అంతర్భాగమని వెల్లడి

యోగాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ యోగాతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. యోగా తనకు లోతైన స్పష్టతను, అంతర్గత పరిపక్వతను అందించిందని, తన ప్రయాణాన్ని అది ఎంతగానో ప్రభావితం చేసిందని ఆదివారం ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

 

"భారత నాగరికతలో యోగా ఒక అంతర్భాగం. ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతమైన బహుమతి ఇది. శారీరక ఆరోగ్యం, మానసిక స్పష్టత, అంతర్గత సమతుల్యతను యోగా ప్రోత్సహిస్తుంది. ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలి" అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

 

చిన్న వయసులోనే తాను యోగా ప్రయాణం ప్రారంభించానని ఆయన గుర్తుచేసుకున్నారు. "నా మదిలో ఎన్నో ప్రశ్నలతో సతమతమవుతున్న సమయంలో, యోగా నాకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా, ప్రగాఢమైన స్పష్టతను, పరిపక్వతను ఇచ్చింది. నా ప్రయాణానికి సరైన మార్గాన్ని చూపింది. క్రియ యోగ, అష్టాంగ యోగ, ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు చెందిన సుదర్శన క్రియ వంటివి ఇప్పటికీ నా దినచర్యలో అంతర్భాగంగా కొనసాగుతున్నాయి" అని ఆయన వివరించారు. 

 

యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషిని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలన్న మోదీ చొరవకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

 

విశాఖలో ఘనంగా యోగా వేడుకలు

మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖపట్నంలోని సాగరిక ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వి. అనిత పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ గణబాబు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి ఆమె యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఆంధ్ర యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ జి.పి. రాజశేఖర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యోగా అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర సంఘాల సభ్యులు, సాధారణ పౌరులు, యువత ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం కొత్తూరు మురళి: తప్పిన పెను ప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదం మంగళవారం వెలుగులోకి వచ్చింది....
By Kothuru Murali 2026-03-24 13:28:55 0 146
Telangana
దారుణంగా మరణం....
మహబూబాబాద్ జిల్లా: తొర్రూర్ పట్టణ శివారులో దారుణ ఘటన చోటుచేసుకుంది. అమపురం గ్రామానికి చెందిన...
By Gujile Ramu 2026-04-28 07:00:56 0 328
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:31:29 0 45
Andhra Pradesh
కూటమి నాయకుల వేధింపులు దుర్మార్గం - గోపి కుటుంబానికి పార్టీ తరుపున అన్ని విధాలా అండగా ఉంటాం - మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు *
*కూటమి నాయకుల వేధింపులు దుర్మార్గం - గోపి కుటుంబానికి పార్టీ తరుపున అన్ని విధాలా అండగా ఉంటాం -...
By John Baji 2025-12-25 14:00:58 0 233
Andhra Pradesh
నారావారిపల్లె సంక్రాంతి సంబరాలు మంత్రి నారా లోకేష్
*Press Release*   *నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి నారా...
By Rajini Kumari 2026-01-13 16:12:47 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com