రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు ముందస్తు అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించి జిల్లా కలెక్టర్, ఎస్పీ గారు

0
66

రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ గారు

రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా రాక నేపధ్యంలో అత్యంత పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు: మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు

ఈ నెల 27వ తేదీ న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం, క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో సంజీవిని పథకం లో భాగంగా డిజిటల్ నర్వ్ సెంటర్ ప్రారంభించునున్న నేపథ్యంలో ముందస్తుగా భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత, ఐఏఎస్, జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపియస్.,గార్లతో పాటు గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు మరియు జిల్లా అధికారులు పరిశీలించారు.

హెలిప్యాడ్ ప్రదేశం, ప్రజా వేదిక, పార్కింగ్ ప్రాంతాలను, సీఎం కాన్వాయ్ రూట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు చుట్టు ఉన్న ప్రాంతములను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంకా తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు వీఐపీల వాహనాల రాక, సభా స్థలంలో వేదిక, పార్కింగ్‌ ఏరియా, సీఎం ప్రవేశం, నిష్క్రమణ స్థలాలను, హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ఉన్న రూట్ ను, క్షుణ్ణంగా పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. ఇతర శాఖల సమన్వయంతో అన్ని చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ గారి ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో మార్కాపురం జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం డి.ఎస్.పి యు. నాగరాజు, ఎస్బి ఇన్స్పెక్టర్ యం.శ్రీనివాసరావు, గిద్దలూరు అర్బన్ సీఐ కె. సురేష్, రూరల్ సీఐ రామకోటయ్య, కంభం సీఐ మల్లికార్జున మరియు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Jammu & Kashmir
Dachigam Huddle: NC Slams UT Setup, Plans Delhi Stir for Statehood
Jammu and Kashmir Chief Minister Omar Abdullah held an unexpected legislative review meeting at...
By Tejaswini Komanduru 2026-06-04 10:37:09 0 114
Telangana
జూన్ 2 నుంచి కొత్త పెన్షన్స్ మంత్రి వివేక్ చెప్పడం జరిగింది....!
జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు: మంత్రి వివేక్ భారత్ అవాజ్ న్యూస్: 18 మే రోజున తెలంగాణ మంత్రివర్గ...
By Gujile Ramu 2026-05-18 03:22:06 0 129
Himachal Pradesh
Himachal Pradesh Boosts Infrastructure and Connectivity
Himachal Pradesh is witnessing major progress in infrastructure and connectivity projects aimed...
By Fathima Safa 2026-06-29 12:26:48 0 80
SURAKSHA
. Community Policing and Public Awareness
​Content: Karnataka Police goes beyond just law enforcement by connecting with the public through...
By Kalaga Sailaja 2026-06-29 11:24:01 0 78
Andhra Pradesh
అమరావతిలో అటల్ బిహారీ వాజ్‌పేయి కాంస్య విగ్రహావిష్కరణకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గము నుండి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లిన ఎన్డీయే కూటమి నేతలు ప్రజలు
భారత మాజీ ప్రధాని, అజాత శత్రువుగా దేశ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిన అటల్ బిహారీ వాజ్‌పేయి...
By John Baji 2025-12-25 14:04:57 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com