పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో భారీ ఊరట.. ఆ పోస్టులు తొలగించాలని ఆదేశం

0
71

పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో మధ్యంతర ఊరట

భూకబ్జా ఆరోపణలపై దాఖలు చేసిన పరువు నష్టం దావా  

అవమానకరమైన పోస్టులను తొలగించాలని సోషల్ మీడియాకు ఆదేశం

తెలంగాణలోని కోడి చెరువు భూములకు సంబంధించిన వివాదం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రసారమైన కథనాలు, వీడియోలు మరియు పోస్టులను తక్షణమే తొలగించాలని లేదా నిలిపివేయాలని ఎక్స్, గూగుల్, మెటా వంటి సామాజిక మాధ్యమ వేదికలను బెంగళూరు న్యాయస్థానం ఆదేశించింది.

 

తెలంగాణలోని కోడి చెరువు భూ వివాదానికి సంబంధించి తనపై వస్తున్న అసత్య ఆరోపణలపై పవన్ కల్యాణ్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను విచారించిన కోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌లో పేర్కొన్న నిర్దిష్ట యూఆర్‌ఎల్‌లతో పాటు, అజ్ఞాత ఖాతాల నుంచి వచ్చే ఇటువంటి పోస్టులకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేస్తూ కోర్టు "జాన్ డో" (John Doe) ఉత్తర్వులు ఇచ్చింది.

 

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని కోడి చెరువు భూములను పవన్ కల్యాణ్ కబ్జా చేశారని, భూ రికార్డులను తారుమారు చేశారని ఆరోపిస్తూ మే నెలాఖరు నుంచి జూన్ మొదటి వారం మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ దుష్ప్రచారంపై పవన్ కల్యాణ్ న్యాయపోరాటం ప్రారంభించారు. బుధవారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం, తదుపరి విచారణను జులై 24వ తేదీకి వాయిదా వేసింది.                               

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రధాన రహదారి పై ధర్నా నిర్వహించిన బీజేపీ శ్రేణులు
నస్పూర్ : తేదీ  07/05/2026, తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు చేసిన...
By Avunoori Mahesh 2026-05-07 10:11:54 0 180
Tamilnadu
"బండి భగీరథ్ కేసులో SIT దర్యాప్తు.. రాజకీయాలు, మీడియా తీరు చుట్టూ కొనసాగుతున్న చర్చ.|
హైదరాబాద్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి...
By Sidhu Maroju 2026-05-11 10:40:09 0 352
Telangana
"గడ్డి మందు నిషేధం: యువత రక్షణ కోసం దిశానిర్దేశం”.|
హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీలో గడ్డి మందును నిషేధించే తీర్మానం తీసుకోవడం నిజమైన విజయంగా...
By Sidhu Maroju 2026-03-30 18:11:05 0 163
Punjab
Punjab Advances Education and Digital Learning Reforms
Punjab continues to strengthen its education system in 2026 by expanding digital learning...
By Fathima Safa 2026-07-04 11:07:37 0 30
Andhra Pradesh
నిమ్మనపల్లె: బండ్లపై వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి తీవ్ర గాయాలు.
నిమ్మనపల్లె మండలంలోని బండ్లపై వద్ద శుక్రవారం ఉదయం ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్‌తో...
By Pagadala Venkateswar 2026-05-29 13:03:14 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com