"ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసిన సాయిబాబా నగర్ కాలనీ ప్రతినిధులు."|

0
105

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : తమ కాలనీలో ఎదుర్కొంటున్న తీవ్రమైన మౌలిక వసతుల సమస్యలపై సాయిబాబా నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

191వ డివిజన్ మచ్చబొల్లారం పరిధిలోని సాయిబాబా నగర్ కాలనీలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, దెబ్బతిన్న రోడ్లు, మరియు వీధి దీపాల సమస్యను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నా, తమ కాలనీలో కనీస వసతులు లేక నివాసితులు పడుతున్న అవస్థలను ఈ సందర్భంగా వివరించారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్యరెడ్డి, సూర్య ఆధ్వర్యంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు ఎంపీకి వినతిపత్రం సమర్పించారు. 

ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎంపీ ఈటల రాజేందర్, సంబంధిత అధికారులతో మాట్లాడి డ్రైనేజీ, రోడ్లు మరియు వీధి దీపాల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకుంటామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో సాయిబాబా నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు బంగారు రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాలివాహన, సభ్యులు సత్యనారాయణ, సమ్మి రెడ్డి, వరుణ్ కుమార్, డి. శ్రీధర్ రెడ్డి తదితర కాలనీవాసులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
గుర్తుతెలియని వాహనం ఢీకొని డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
మంగళవారం రాత్రి పుంగనూరు మండలం మొరంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ బస్సు డ్రైవర్...
By Kothuru Murali 2026-02-25 11:11:57 0 263
Andhra Pradesh
నంద్యాల పార్లమెంట్ కమిటీ ఏర్పాటు !!
కర్నూలు : పాణ్యం : తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల...
By Hari Krishna 2025-12-26 16:22:23 0 229
Andhra Pradesh
మదనపల్లె-రామసముద్రం ఆర్టీసీ బస్సుల దుస్థితి.. ప్రయాణికుల ఆవేదన.
మదనపల్లె నుంచి రామసముద్రం వెళ్లే ఆర్టీసీ బస్సులు సరిగా లేకపోవడం, ఉన్నవి కూడా తరచూ ఆగిపోవడంతో...
By Pagadala Venkateswar 2026-05-24 07:41:39 0 108
Andhra Pradesh
వెదుళ్ళపల్లి సెంటర్ వద్ద బోల్తా పడిన గడ్డివాము ట్రాక్టర్ * ప్రమాదకరంగా మారుతున్న అధికంగా లోడ్ వాహనాలు
బాపట్ల జిల్లా పరిధిలోని వెదుళ్ళపల్లి సెంటర్ వద్ద గురువారం ఒక ప్రమాదం చోటుచేసుకుంది. గడ్డివాముతో...
By Vadlamudi NagaVenkat 2026-03-12 14:34:41 0 1K
Telangana
అల్వాల్ చెరువు కట్ట పైన లైట్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:  అల్వాల్ చెరువు కట్ట పరిధిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు....
By Sidhu Maroju 2025-08-19 15:43:53 0 605
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com