"ఎంపీ ఈటల రాజేందర్ను కలిసిన సాయిబాబా నగర్ కాలనీ ప్రతినిధులు."|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : తమ కాలనీలో ఎదుర్కొంటున్న తీవ్రమైన మౌలిక వసతుల సమస్యలపై సాయిబాబా నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
191వ డివిజన్ మచ్చబొల్లారం పరిధిలోని సాయిబాబా నగర్ కాలనీలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, దెబ్బతిన్న రోడ్లు, మరియు వీధి దీపాల సమస్యను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నా, తమ కాలనీలో కనీస వసతులు లేక నివాసితులు పడుతున్న అవస్థలను ఈ సందర్భంగా వివరించారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్యరెడ్డి, సూర్య ఆధ్వర్యంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు ఎంపీకి వినతిపత్రం సమర్పించారు.
ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎంపీ ఈటల రాజేందర్, సంబంధిత అధికారులతో మాట్లాడి డ్రైనేజీ, రోడ్లు మరియు వీధి దీపాల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకుంటామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సాయిబాబా నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు బంగారు రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాలివాహన, సభ్యులు సత్యనారాయణ, సమ్మి రెడ్డి, వరుణ్ కుమార్, డి. శ్రీధర్ రెడ్డి తదితర కాలనీవాసులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz