"ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసిన సాయిబాబా నగర్ కాలనీ ప్రతినిధులు."|

0
106

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : తమ కాలనీలో ఎదుర్కొంటున్న తీవ్రమైన మౌలిక వసతుల సమస్యలపై సాయిబాబా నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

191వ డివిజన్ మచ్చబొల్లారం పరిధిలోని సాయిబాబా నగర్ కాలనీలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, దెబ్బతిన్న రోడ్లు, మరియు వీధి దీపాల సమస్యను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నా, తమ కాలనీలో కనీస వసతులు లేక నివాసితులు పడుతున్న అవస్థలను ఈ సందర్భంగా వివరించారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్యరెడ్డి, సూర్య ఆధ్వర్యంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు ఎంపీకి వినతిపత్రం సమర్పించారు. 

ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎంపీ ఈటల రాజేందర్, సంబంధిత అధికారులతో మాట్లాడి డ్రైనేజీ, రోడ్లు మరియు వీధి దీపాల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకుంటామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో సాయిబాబా నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు బంగారు రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాలివాహన, సభ్యులు సత్యనారాయణ, సమ్మి రెడ్డి, వరుణ్ కుమార్, డి. శ్రీధర్ రెడ్డి తదితర కాలనీవాసులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
SURAKSHA
Navin Mittal IAS: Leading Telangana's Transformation
From IIT Delhi to Special Chief Secretary of Energy, this 1996-batch administrator has spent...
By Lokeshwari Panthadi 2026-07-10 06:17:40 0 138
Andhra Pradesh
12 కోట్లు సహాయనిధి మంజూరు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
ఇప్పటివరకు రూ.12 కోట్ల సీఎం సహాయనిధి మంజూరు.   -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు....
By Rajini Kumari 2025-12-31 10:45:33 0 400
Telangana
ప్రభుత్వ భూములను సంరక్షించాలి, ఆర్డీవో కు వినతి
చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో, శ్రీ లక్ష్మీనరసింహస్వామి, గుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ భూములు ,...
By Nookapangu Manikanta 2026-05-14 12:59:40 0 195
Andhra Pradesh
శశాంక్ రెడ్డి అండర్ 14 స్క్వాష్ జట్టుకు ఎంపిక.
మదనపల్లి మండలం చిన్నతిప్పసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి జి. శశాంక్ రెడ్డి...
By Pagadala Venkateswar 2026-04-11 12:48:44 0 114
Andhra Pradesh
కోడి రామ్మూర్తి స్టేడియం పనుల వేగవంతం
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గారు కోడి రామ్మూర్తి స్టేడియం అభివృద్ధి పనులను శుక్రవారం స్వయంగా...
By Manda Ramkumar 2026-03-27 13:04:14 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com