8వ వార్డులో విస్తృత పర్యటన నిర్వహించిన కార్పొరేటర్ మేకల రామ్

0
200

శ్రీరాంపూర్ : ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 8వ వార్డులో కార్పొరేటర్ మేకల రామ్ విస్తృతంగా పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యానికి సంబంధించిన సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు,ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను నేరుగా కార్పొరేటర్‌కు వివరించగా, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని మేకల రామ్ తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు."ప్రజల సమస్యలే నా బాధ్యత – వార్డు అభివృద్ధే నా లక్ష్యం" అని కార్పొరేటర్ మేకల రామ్ అన్నారు.

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కార్యాలయన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ యువరాజ్ మార్మట్, వర్షాకాలం ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ రాబోయే...
By Chunarkar Jagadeesh 2026-06-06 05:25:52 0 230
Andhra Pradesh
పుంగనూరు: నల్ల బెల్లం స్వాధీనంపై అప్డేట్
కడప ఎన్ఫోర్స్మెంట్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు...
By Kothuru Murali 2026-04-25 03:44:10 0 96
SURAKSHA
Ajay Singhal, IPS: A Legacy of Bold Police Leadership
A 1992-batch IPS officer leading Haryana Police with integrity, discipline, and a commitment to...
By Lokeshwari Panthadi 2026-07-24 08:33:57 0 23
Andhra Pradesh
పుంగనూరు: గ్యాస్ సిలిండర్ పేలి రూ 4. 98 లక్షల నష్టం
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, పాత కురవపల్లిలో గురువారం రాత్రి సిలిండర్ పేలి ఒక వంటగది...
By Kothuru Murali 2026-05-03 16:23:18 0 90
Andhra Pradesh
టిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయంటిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయం
బాపట్ల మండలం అడవి పంచాయతీ పాండురంగాపురం కొత్త వాడరేవు గ్రామానికి చెందిన వారి సుబ్రమణ్యం రెడ్డి...
By Vadlamudi NagaVenkat 2026-05-23 13:02:02 0 239
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com