స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకానికి జగన్ లేఖలు: పట్టాభిరామ్ ఆరోపణ.

0
85

 

 

స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకానికి జగన్ లేఖలు: పట్టాభిరామ్ ఆరోపణ

12-06-2026 Friday

Andhra

YS Jagan Mohan Reddy letters for sale of Steel Plant lands Pattabhiram allegation

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దెబ్బతీయడంలో జగన్ పాత్రపై టీడీపీ ఆరోపణ

ప్లాంట్ భూములు అమ్మి నిధులు సమీకరించాలని కేంద్రానికి జగన్ లేఖలు రాశారన్న పట్టాభి

ఉక్కు గనుల లీజులను పునరుద్ధరించకుండా అడ్డుకున్నారని విమర్శ

జగన్ హయాంలో ఉత్పత్తి తగ్గి, ఉద్యోగుల సంఖ్య పడిపోయిందని ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ భూముల్లో లేఅవుట్లు వేసి విక్రయించాలని, కీలకమైన గనుల లీజులను పునరుద్ధరించకుండా అడ్డుకోవాలని జగన్ కేంద్రానికి లేఖలు రాశారని, ఇటువంటి చర్యల వల్లే ప్లాంట్ ఆర్థికంగా కుదేలైందని ఆయన విమర్శించారు.

 

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్‌కు చెందిన వేలాది ఎకరాల భూములను విక్రయించి, ఆ నిధులతో ప్లాంట్‌ను బలోపేతం చేయాలని జగన్ కేంద్రానికి ప్రతిపాదించారని ఆరోపిస్తూ, అందుకు సంబంధించిన పత్రాలను ఆయన మీడియాకు ప్రదర్శించారు.

 

జగన్ ప్రభుత్వ హయాంలో (2019-2024) ప్లాంట్‌కు అనుబంధంగా ఉన్న విజయనగరం జిల్లాలోని మాంగనీస్, సిలికా గనుల లీజులను ఉద్దేశపూర్వకంగానే పునరుద్ధరించలేదని పట్టాభి ధ్వజమెత్తారు. వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. దీనివల్ల ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యం 25 శాతం పడిపోయిందని, ఉద్యోగుల సంఖ్య కూడా 2020లో 17,000 ఉండగా, 2023 నాటికి 14,800కి తగ్గిపోయిందని వివరించారు.

 

అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గనుల లీజులను పొడిగించిందని, తద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని 90 శాతానికి పైగా పునరుద్ధరించిందని పట్టాభి తెలిపారు. ప్రభుత్వ చొరవ ఫలితంగా ప్లాంట్ సుమారు రూ. 54 కోట్ల లాభాన్ని నమోదు చేసిందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటానని జగన్ చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని, ఆయన గతంలో కేంద్రానికి రాసిన లేఖలే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు.                                

Search
Categories
Read More
Telangana
తెలంగాణలో త్వరలో ఎస్ఐఆర్.|
    హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ(SIR)ను...
By Sidhu Maroju 2025-12-21 11:26:20 0 221
Maharashtra
Water Resource Management and Irrigation in Maharashtra
Water resource management and irrigation projects play a crucial role in Maharashtra’s...
By Fathima Safa 2026-06-23 07:40:12 0 95
Telangana
మంచిర్యాల: మాదిక దవ్యాలు కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ
అంతర్జాతీయ మాదికి దవ్యాల నిరోధిక దినోత్సవం సందర్భంగా మంచిర్యాల్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ నుంచి...
By Bonagiri RaviShankar 2026-06-26 08:37:18 0 129
Andhra Pradesh
దగ్గు మాత్రమే టీబీ లక్షణం కాదు: డిప్యూటీ హెచ్‌ఈఓ.
నిమ్మనపల్లి మండలం బాలేపల్లిలో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్...
By Pagadala Venkateswar 2026-06-23 14:11:21 0 48
Andhra Pradesh
పుంగనూరు అన్నమయ్య జిల్లా సోమల వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ
అన్నమయ్య జిల్లా సోమల మండలంలో శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య...
By Kothuru Murali 2026-07-11 15:53:12 0 83
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com