పోలీసునని నమ్మించి కారు కజేసిన యువకుడు

0
104

BHARAT AAWAZ న్యూస్ 

పోలీసునని నమ్మించి కారు కాజేసిన యువకుడు 

కళ్యాణదుర్గం, తాను పోలీసు శాఖలో ఎస్‌.ఐ.నని నమ్మించి అద్దెకు తీసుకున్న కారును తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన యువకుడిని కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చల్లాపల్లి గ్రామానికి చెందిన గంటప్పగారి అనిల్‌కుమార్‌ (27)ను సోమవారం బోరంపల్లి గ్రామ బస్‌స్టాప్‌ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం మేరకు.. జస్ట్‌డయల్‌ యాప్‌ ద్వారా కారు యజమాని జి.మనోహర్‌ను సంప్రదించిన అనిల్‌కుమార్‌, తాను పోలీసు శాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌నని చెప్పి నమ్మించాడు. వాట్సాప్‌ ద్వారా పోలీసు యూనిఫాం ధరించిన ఫొటోలను పంపి విశ్వాసం కలిగించాడు. అనంతరం మారుతి సుజుకి డిజైర్‌ కారు (ఏపీ 39 ఎన్‌టీ 8616)ను రోజువారీ అద్దెకు తీసుకుని తిరిగి ఇవ్వకుండా వివిధ ప్రాంతాల్లో వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది.

విచారణలో అనంతపురం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనూ ఇదే తరహాలో మరికొందరిని మోసం చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అతని వద్ద నుంచి కారుతో పాటు మోసానికి ఉపయోగించిన పోలీసు యూనిఫాంను స్వాధీనం చేసుకున్నారు.

ఎస్‌డీపీవో పి. రవిబాబు ఆదేశాల మేరకు సీఐ పి. గణేష్‌ ఆధ్వర్యంలో కేసును వేగంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని ఎస్‌డీపీవో అభినందించారు.

Search
Categories
Read More
Tamilnadu
Tamil Nadu Advances Urban Development and Smart Cities
Tamil Nadu continues to accelerate urban development through Smart Cities Mission projects,...
By Fathima Safa 2026-07-02 06:43:54 0 42
Telangana
ఎం.పి.ఈటెల ప్రెస్ మీట్
 మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్   రైలు నిలయంలో సంబంధిత అధికారులందరితో...
By Sidhu Maroju 2025-05-31 06:03:45 0 2K
Business & Finance
Working Capital Loans to Keep Your Business Moving
Working capital loans provide businesses with the funds needed to manage daily operational...
By Navya Sree 2026-07-23 05:39:09 0 18
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:43 0 37
Andhra Pradesh
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో భారీ ఊరట.
ఏకసభ్య కమిషన్ ఏర్పాటును సవాలు చేసిన సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేత కమిటీ విచారణ...
By Pagadala Venkateswar 2026-02-23 10:13:00 0 269
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com