గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు!.

0
66

 

గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు!

Andhra

Somu Veerraju commends Deputy CM Pawan Kalyan for Godavari pollution control

గోదావరి ప్రక్షాళనకు కేంద్రం ఏడాదికి రూ. 400 కోట్లు కేటాయించిందన్న వీర్రాజు

పుష్కరాల నేపథ్యంలో 290 గ్రామాలను అభివృద్ధి చేయాల్సి ఉందని వ్యాఖ్య

ఆంధ్ర పేపర్ మిల్లుకి నోటీసులు ఇవ్వాలని పవన్ ఆదేశించడంపై హర్ష్యం

గోదావరి నదిని కాలుష్యం నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. నది ప్రక్షాళన కోసం కేంద్రం ఏడాదికి రూ.400 కోట్ల చొప్పున నిధులు ప్రకటించిందని, అందులో ఇప్పటికే రూ.100 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలోని 290 గ్రామాలను అభివృద్ధి చేయాల్సి ఉందన్న ఆయన.. మునికూడలిలో ఘాట్ నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోందని తెలిపారు.

 

 

ఇదే సమయంలో, గోదావరి నది కాలుష్యంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించిన తీరును సోము వీర్రాజు అభినందించారు. నదిని కాలుష్య కోరల నుంచి కాపాడేందుకు ఆంధ్ర పేపర్ మిల్లుతో పాటు రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పవన్ ఆదేశించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గతంలో పేపర్ మిల్లు కాలుష్యంపై ఎవరు మాట్లాడినా బ్లాక్‌మెయిల్ చేస్తారనే వాదన ఉండేదని, కానీ ఒక డైనమిక్ లీడర్‌గా పవన్ కల్యాణ్ ఆ అడ్డంకులను అధిగమించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.

 

 

దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా సేవలు అందిస్తున్న నరేంద్ర మోదీ పాలన స్ఫూర్తితోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రధాని మోదీ పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: కల్యాణలక్ష్మి - షాధీముబారక్ చెక్కల పంపిని
ఈ రోజు నందిపేట్ మండల రెవెన్యు కార్యాలయంలో కళ్యాణలక్ష్మిషాదీముబారక్ పాతకాల లబ్ధికారులకు చెకుల...
By Sadaq Sadaq 2026-04-20 16:28:01 0 134
Andhra Pradesh
ఎస్ ఐ ఆర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్నా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రంజిత్ రాయల్
*సర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న రంజిత్ రాయల్*   అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం,...
By Benguluri Madhubabu 2026-06-24 03:34:57 0 116
Andhra Pradesh
రాముడు రామాయణం గురించి పిల్లలకు చెప్పండి తిరుపతి సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు నాయుడు
*Tirupathi*   *మన పురాణ పురుషుల గురించి యువతకు, పిల్లలకు చెప్పండి...రాముడు..రామరాజ్యం...
By Rajini Kumari 2025-12-26 10:14:51 0 248
Nagaland
NU Fights Addiction with Massive Signature Drive
Nagaland University (NU) has officially launched a decisive, week-long signature campaign aimed...
By Lokeshwari Panthadi 2026-06-26 07:09:06 0 56
Andhra Pradesh
మచిలీపట్నంలోని పలు పోలీస్ స్టేషన్ల తనిఖీ చేసిన ఐ జి పి అశోక్ కుమార్
*కృష్ణాజిల్లా మచిలీపట్నం*    మచిలీపట్నం లోని పలు పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన ఐ జి...
By Rajini Kumari 2026-03-24 12:09:45 0 220
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com