ఆసిఫాబాద్‌: లుంబిని దీక్షాభూమి కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరు చేయాలి

0
304

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి చునార్ కార్  జగదీష్)

ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షాభూమి ఆవరణలో నూతన కమ్యూనిటీ భవన నిర్మాణానికి ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని కోరుతూ సెంటర్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మసాడే ప్రశాంత్, దుర్గం ప్రశాంత్ మరియు లుంబిని దీక్షాభూమి కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు దుర్గం తుకారాం, రాజ్‌కుమార్ నేతృత్వంలోని నాయకులు సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్తూ. ఆసిఫాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సుమారు 50 వేల మంది మహార్ మరియు నేతకాని సామాజిక వర్గాల ప్రజలకు ఈ కమ్యూనిటీ భవనం ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని వివరించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు ఆత్మారాం, విలాస్, వామన్, లోహాజీ,పురుషోత్తం, సంజు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చిల్లకల్లు గ్రామంలో గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ రంగుల మహోత్సవం
జగ్గయ్యపేట    కన్నుల పండువగా శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారు రంగుల మహోత్సవ...
By Rajini Kumari 2026-01-06 10:58:42 0 206
Andhra Pradesh
బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం కృషిచేసిన ఎర్రం నాయుడు
*ప్రచురణార్థం* *23-02-2026*     *బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన...
By Rajini Kumari 2026-02-23 10:33:02 0 163
Telangana
జెర్రీ పోతుల గూడెం AITUC కమిటీ ఎన్నిక
చిలుకూరు మండల కేంద్రానికి చెందిన, జెర్రిపోతులగూడెం గ్రామ AITUC నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది....
By Nookapangu Manikanta 2026-04-29 14:26:37 0 151
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:రొంపిచర్లపొలం దగ్గర ఉంచిన ద్విచక్ర వాహనానికి నిప్పు
రొంపిచర్ల మండలం చల్లవారిపల్లె పంచాయతీ వైసీపీ కన్వీనర్ మోహన్ రెడ్డి శనివారం తన ద్విచక్ర వాహనాన్ని...
By Kothuru Murali 2026-06-06 15:13:06 0 82
Andhra Pradesh
సీఎం చంద్రబాబును కలిసిన నటుడు మురళీమోహన్
‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటన సందర్భంగా నటుడు, వ్యాపారవేత్త మాగంటి మురళీమోహన్...
By Rajini Kumari 2026-02-07 11:59:04 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com