గాంధీభవన్‌లో మల్కాజిగిరి పార్లమెంట్ సమావేశం – కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి

0
262

హైదరాబాద్, మే 30: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. శనివారం గాంధీభవన్ ప్రాంగణంలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించారు.

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం, డివిజన్ అధ్యక్షుల ఎంపిక, అనుబంధ సంఘాల కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలోని ఇందిరా భవన్‌లో ఈ సమావేశం జరిగింది.

 శనివారం నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఆధ్వర్యం వహించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యేలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు హాజరయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడం, రాబోయే రాజకీయ కార్యక్రమాలకు సిద్ధం కావడం లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు.

 

సమావేశంలో మాట్లాడిన మీనాక్షి నటరాజన్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ బలోపేతానికి అవసరమైన సూచనలు, కార్యాచరణపై నాయకులకు మార్గనిర్దేశం చేశారు.

కూకట్పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బండి రమేష్ మాట్లాడుతూ, కూకట్పల్లి అసెంబ్లీ పరిధిలో బీఎల్‌ఏల నియామకాలపై నిర్వహించిన సమావేశాల వివరాలను పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సమగ్ర నివేదిక రూపంలో అందజేశామని తెలిపారు. పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలను అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్టీసీ బస్సు కండక్టర్ తీరుపై ప్రయాణికుల ఆరోపణలు.
మదనపల్లె–తంబళ్లపల్లి ఆర్టీసీ బస్సు ఉదయం 6:50 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, కండక్టర్ నాగమణి...
By Pagadala Venkateswar 2026-06-29 07:58:10 0 45
Andhra Pradesh
Chandrababu : దావోస్‌లో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. యూఏఈ మంత్రితో కీలక భేటీ.
దావోస్‌ పర్యటనలో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రితో సమావేశం...
By Pagadala Venkateswar 2026-01-20 10:46:07 0 306
Andhra Pradesh
శ్రీ బాల ఆర్యటమ్మ తల్లి తిరునాళ్ళు మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
శ్రీ బాల ఆరేటమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.  ...
By Rajini Kumari 2026-02-28 12:54:32 0 158
Andhra Pradesh
CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం.
AP: అమరావతిలో CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్లతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వార్షిక రుణ...
By Pagadala Venkateswar 2026-01-23 07:00:17 0 159
Andhra Pradesh
పెంచిన బడ్జెట్ కేటాయింపుల్లో రైల్వే శాఖకు అభివృద్ధి ప్రోత్సాహం
SCR BZA PR No.296 తేదీ: 07 ఫిబ్రవరి , 2026   *పెంచిన బడ్జెట్ కేటాయింపులతో ఆంధ్రప్రదేశ్...
By Rajini Kumari 2026-02-07 12:01:57 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com