భరత్ నగర్‌లో రూ.14 లక్షల పైప్లైన్ పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన

0
243

హైదరాబాద్, కూకట్పల్లి, మే 29: కూకట్పల్లి నియోజకవర్గంలోని భరత్ నగర్ హెచ్.ఐ.జి ప్రాంతంలో రూ.14 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన పైప్లైన్ పనులకు శుక్రవారం మాధవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటం తన బాధ్యత అని తెలిపారు. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కొరత లేకుండా తరచూ శంకుస్థాపనలు జరిగేవని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా కూకట్పల్లి అభివృద్ధికి సరిపడా నిధులు మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అరకొర నిధులతో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లడం కష్టంగా మారిందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని, మూడుసార్లు అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, బిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
నడిరోడ్డుపై మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్ . ‎
ఇటీవల మణికొండలోని అల్కాపూర్ టౌన్ షిప్ లో ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి...
By Ponnala Srinivasrao 2026-05-25 02:34:26 0 110
Andhra Pradesh
బివి జయనాగేశ్వర్ రెడ్డి కు కృతజ్ఞతలు చెప్పిన ఎమ్మిగనూరు టిడిపి నాయకులు
ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమితులైన శ్రీ...
By Boya Dasthagiri 2026-04-08 07:25:46 0 183
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలోని కూటమి నాయకులు CBN జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారి 76 వ జన్మదిన వేడుకలను...
By Boya Dasthagiri 2026-04-20 15:40:30 0 155
Andhra Pradesh
అతిగా మద్యం సేవించి నాయి బ్రాహ్మణుడు మృతి.
మదనపల్లెలో అతిగా మద్యం సేవించడం వల్ల సత్యసాయి జిల్లా కదిరి పిల్లవంక కాలనీకి చెందిన నారాయణ అనే...
By Pagadala Venkateswar 2026-06-23 06:11:17 0 57
Andhra Pradesh
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు పర్యటించారు!!!!!!!
అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు...
By SivaNagendra Annapareddy 2025-12-21 14:46:57 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com