సముద్ర గర్భం కుచించిపోతోంది నానాటికి మన అడవులు అంతరించిపోతున్నాయి

0
75

సముద్ర గర్భం కుచించుకుపోతుంది.. నానాటికి మడ అడవులు అంతరించిపోతున్నాయి.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. సముద్ర తీరo వెంబడి గ్రామాల ప్రజల రక్షణ దినదిన గండంగా మారుతుంది. కొందరి స్వార్థపరుల దురాక్రమణ, భూ కబ్జాదార్ల మితిమీరిన బూదాహం, అక్రమార్జన.. దోపిడీ... కొందరి స్వార్థ రాజకీయపరుల స్వలాభాలు.. అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వంటి కారణంగానే సముద్రం వెంబడి ప్రభుత్వ, పంచాయితీ ఫారెస్ట్, అసైన్డ్ భూములు అన్యాక్రాంతమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఇలా కాలోనే చట్టాల ఉల్లంఘన.. పర్యావరణ విఘాత చర్యలు.. భూకబ్జాలు చోటు చేసుకోవడం కోసమెరుపు.!

 బందరు రూరల్ మండలం, పెదపట్నం గ్రామపంచాయతీ పరిధిలోని 181, 182/1,182/2,155/A155/B లలో సుమారు 40 ఎకరాల గ్రామపంచాయతీ ఆస్వాదిన అసైన్డ్, దిబ్బ, ఫారెస్ట్ భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయి. ఆక్రమణదారులు సముద్రానికి రక్షణగా ఉన్న మడ అడవులు నరికివేసి ఆ భూముల్లో చెరువులు తవ్వారు. ఆక్రమణదారులు ఆ ప్రాంతంలో తమకున్న 16 సెంట్లు భూమిని చూపుతూ ఈ భూకబ్జాకు పాల్పడినట్లు సమాచారం.

*సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు పాతర.. CRZ నిబంధనలకు విరుద్ధం.

 పెదపట్నంలో యదేచిగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు పాతరేస్తున్నారు. సి ఆర్ జెడ్ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. మార్గదర్శకాలు.. సి ఆర్ జెడ్ జోన్ వన్ నిబంధన ప్రకారం సముద్రానికి 500 మీటర్ల లోపు ఎలాంటి ఆక్రములకు పాల్పడకూడదు. మడ అడవులు నరకడం, భూముల ఆక్రమించి చెరువులు తవ్వడం, పర్యావరణానికి విగాతం కలిగించడం, వన్యప్రాణులకి నష్టం కలిగించే చర్యలు చేపట్టడం చట్టరీత్యా కఠిన నేరం. ఇవేమీ పట్టకుండా బంటుమిల్లి కి చెందిన ఓ న్యాయవాది పట్టపగలే మడ అడవులు నరికి చెరువులు తవ్వి భూ కబ్జాకు పాల్పడి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు సవాల్ విసరడం ఇక్కడ కొస మెరుపు. ఆక్రమణలతో సముద్రం ఘోషిస్తున్న అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విశేషం.

* జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు 

..................

 పెదపట్నంలో భూముల ఆక్రమణ, మడ అడవులు నరికి చెరువులు తవ్విన ఘటనపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, సి ఆర్ జెడ్ జోన్ వన్ నిబంధనలకు వ్యతిరేకంగా అధికారులు అండదండలతో 40 ఎకరాలు ఆక్రమించారని మచిలీపట్నానికి చెందిన న్యాయవాది జీవీ రమణ జిల్లా కలెక్టర్ బాలాజీ ని కలిసి ఫిర్యాదు అందజేశారు. అంగర రంగనాథ్, అంగర రామ్మోహన్ రావు, అంగర వెంకట నవీన, అంగర రమాదేవి, అంగర రజిని, అంగర అరుణ్ కుమార్ లు ఈ ఆక్రమణకు పాల్పడి మడ అడవులు నరికి చెరువులు తవ్వారని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుని సహకరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపట్టి భూములు స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల ప్రజల అభిష్టం – ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి
మంచిర్యాల నియోజకవర్గం జూన్ 1 : మంచిర్యాల రాజకీయాల్లో ప్రజలతో నిత్యం మమేకమై పనిచేసే నాయకుడిగా...
By Avunoori Mahesh 2026-06-01 04:55:15 0 199
Uttarkhand
Uttarakhand Advances Clean Energy and Green Growth
Uttarakhand continues to strengthen its clean energy and green development agenda in 2026 by...
By Fathima Safa 2026-07-04 12:00:11 0 33
Andhra Pradesh
దుర్గ గుడిలో జరుగుతున్న వరుస ఆపచారాలకు ప్రాయశ్చిత్తంగా కామధేను అమ్మవారి వద్ద వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు
విజయవాడ  12-01-2026   ప్రచురణార్ధం   దుర్గ గుడిలో జరుగుతున్న వరుస అపచారాలకు...
By Rajini Kumari 2026-01-12 13:15:41 0 207
Andhra Pradesh
ప్రభుత్వం మేల్కొని ప్రజలకు వైద్యం అందించాలి
కూటమి ప్రభుత్వం మేల్కొని ప్రజలకు వైద్య సేవలు అందించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి...
By Boiena Rajesh 2026-02-28 14:37:49 0 209
Andhra Pradesh
ఏపీలో హోటల్ ఫుడ్ ప్రియులకు షాక్.. 10 శాతం పెరగనున్న మెనూ ధరలు.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు ఏపీ స్టార్ హోటళ్లలో 10 శాతం ధరల పెంపునకు నిర్ణయం ప్రకటన...
By Pagadala Venkateswar 2026-05-02 04:20:45 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com