జూన్ 1న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి: పర్యటన తేదీలో మార్పు
Posted 2026-05-25 02:24:54
0
481
🎤(భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్):కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తేదీలో మార్పు చోటుచేసుకుందని, ముందుగా నిర్ణయించిన జూన్ 2కు బదులుగా ఒక రోజు ముందే.. అంటే జూన్ 1వ తేదీన సీఎం జిల్లాలో పర్యటించనున్నారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీల కోసం ప్రభుత్వం నిర్మించిన 28 ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారు; ఆ తర్వాత కాగజ్నగర్ ఎక్స్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సుగుణక్క పిలుపునిచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆర్ ఎం ఎస్ ర్యాంకును సాధించిన మురళి యూపీ స్కూల్ విద్యార్థిని అభినందించిన సుగవాసి ప్రసాద్ బాబు
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మురళి యూపీ స్కూల్ విద్యార్థి పని రామ వర్మ రాష్ట్రీయ మిలిటరీ...
ఖమ్మం జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.|
హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్ పాడు గ్రామ శివారులోని కాలువలో బోల్తాపడిన వేంసూరు...
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీలో పదో తరగతి (SSC) వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు...
జాహ్నవి మిస్సింగ్ కేసు.. పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్
AP: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సమీపంలో మూడేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై ఆరు రోజులు...
లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు...