గంజాయి నీయంత్రణ మాదక ద్రవ్యల నిర్ములనకై తనిఖీలు : Si ప్రశాంత్

0
43

మంచిర్యాల : గంజాయి,మాదక ద్రవ్యాల నియంత్రణ మరియు ప్రజల్లో అవగాహన పెంపు లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్కోటిక్ డాగ్ స్క్వాడ్,యాంటీ నార్కోటిక్స్ వింగ్, మంచిర్యాల సీసీసీ నస్పూర్ పోలీసుల సమన్వయంతో ఎస్సై ప్రశాంత్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలు సీసీసీ నస్పూర్ కార్నర్ ప్రాంతం,ఆటో స్టాండ్ పరిసరాలు,సమీప హోటళ్లు,పాన్ షాపులు మరియు ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో చేపట్టారు. తనిఖీల సందర్భంగా ఆటో స్టాండ్ వద్ద ఉన్న వ్యక్తులు, ప్రయాణికుల సామాన్లు,హోటళ్ల పరిసరాలు,పాన్ షాపులు మరియు అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.మాదక ద్రవ్యాల అక్రమ రవాణా,వినియోగం మరియు నిల్వలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్సై తెలిపారు. ప్రజలకు గంజాయి, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం అవసరమని ఎస్సై పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఘనంగా హర్ గర్ తిరంగా జెండా కార్యక్రమం.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: అల్వాల్ సర్కిల్ పరిధి  అంబేద్కర్ నగర్ లో  హర్ గర్ తిరంగా...
By Sidhu Maroju 2025-08-14 10:45:19 0 679
Telangana
మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం...సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
    మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం...సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి...
By Pinnehasan Odela 2026-03-09 13:06:13 0 140
Telangana
నిజామాబాద్ : మెప్మా అధ్వర్యంలో వారిధన్యం కొనుగోలు కెంధం ప్రారంభం
జిల్లాలో నీ గిరిరాజ్ కలశలాలో అవారనలో మెప్మా అధ్వర్యంలో  వారిధన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం...
By Sadaq Sadaq 2026-04-21 09:10:15 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com