ఏపీలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.. ఇంటింటి సర్వేకు రంగం సిద్ధం.

0
81

జూన్ 15 నుంచి ఇంటింటికీ వెళ్లి బీఎల్‌వోల సర్వే

నకిలీ, అనర్హుల ఓట్లు తొలగించి పారదర్శక జాబితా రూపకల్పన

జులై 21న ముసాయిదా, సెప్టెంబరు 22న తుది జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. ఇంటింటి సర్వే ద్వారా మరణించిన వారు, నకిలీ, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తామని తెలిపారు. అదే సమయంలో ఒక్క నిజమైన ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా కఠినమైన ధ్రువీకరణ చేపడతామని హామీ ఇచ్చారు.

 

రాష్ట్రవ్యాప్తంగా 46,397 మంది బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) జూన్ 15 నుంచి జులై 14 వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సర్వే చేపడతారని వివేక్ యాదవ్ వివరించారు. ఈ సందర్భంగా ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారాలు ఇస్తారని, అందులో ఒకటి ఓటరు పూర్తిచేసి ఇవ్వాలని, రెండోదానిపై బీఎల్‌వో సంతకం చేసి రశీదుగా అందజేస్తారని తెలిపారు. "ఓటరు జాబితాలో అనర్హులకు చోటుండకూడదు, అర్హులను జాబితా నుంచి తప్పించకూడదు అనే లక్ష్యంతో ఈ ప్రక్రియ చేపడుతున్నాం" అని ఆయన అన్నారు.

 

సర్వే పూర్తయ్యాక జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని సీఈఓ తెలిపారు. ఆ తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలు, క్లెయిములు స్వీకరిస్తారనీ, ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేసి సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002లో జరిగిన తర్వాత, విభజిత రాష్ట్రంలో ఇలాంటి సమగ్ర సవరణ జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Search
Categories
Read More
SURAKSHA
T. N. Venkatesh: Driving Tamil Nadu's Growth Forward
A distinguished 2001-batch IAS officer of the Tamil Nadu cadre, T. N. Venkatesh has built a...
By Lokeshwari Panthadi 2026-07-20 08:28:04 0 51
Business & Finance
₹369 Crore Projects to Boost Uttarakhand's Rural Economy
Union Agriculture Minister Shivraj Singh Chouhan launched 41 agriculture and rural development...
By Navya Sree 2026-07-01 06:23:36 0 103
Himachal Pradesh
Himachal High Court Seeks Transparency in Housing Allotment
The Himachal Pradesh High Court has raised concerns over the lack of transparency in the...
By Navya Sree 2026-06-26 08:55:41 0 44
Telangana
ఫార్మర్ రిజిస్టర్ పూర్తి చేసుకోండి AO తెలపడం జరిగింది....
నల్లబెల్లి: ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోండి: ఏవో భారత్ అవాజ్ న్యూస్: 17 జూన్ వరంగల్ జిల్లా...
By Gujile Ramu 2026-06-17 06:26:40 0 148
Andhra Pradesh
40 వేల మందితో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.. సీఎంతో మాట్లాడడంపై ఉద్యోగుల హర్షం.
  40 వేల మందితో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.. సీఎంతో మాట్లాడడంపై ఉద్యోగుల హర్షం...
By Pagadala Venkateswar 2026-05-19 05:33:56 0 83
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com