"జస్టిస్ గుండ చంద్రయ్య మృతి న్యాయరంగానికి తీరని లోటు : ఎంపీ ఈటెల రాజేందర్ ”

0
484

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తొలి చైర్మన్‌గా సేవలందించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ గుండ చంద్రయ్య మృతి పట్ల మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

జస్టిస్ చంద్రయ్య గారి మరణం న్యాయరంగానికి, ముఖ్యంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే వర్గాలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ విడుదల చేసిన సంతాప సందేశంలో మాట్లాడుతూ, జస్టిస్ గుండ చంద్రయ్య న్యాయవ్యవస్థలో అత్యున్నత విలువలను పాటించిన వ్యక్తిగా చిరస్థాయిగా గుర్తుండిపోతారని తెలిపారు.

న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో ఆయన అనేక కీలక తీర్పులు ఇచ్చి ప్రజల విశ్వాసాన్ని సంపాదించారని కొనియాడారు.

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కూడా జస్టిస్ చంద్రయ్య ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించారని ఈటల రాజేందర్ గుర్తుచేశారు. 

సామాన్య ప్రజలకు న్యాయం అందించాలనే సంకల్పంతో ఆయన పనిచేశారని, ముఖ్యంగా బలహీన వర్గాల హక్కుల పరిరక్షణలో ఆయన చూపిన నిబద్ధత ఆదర్శనీయమని అన్నారు.

న్యాయపరమైన అంశాలపై విశేష పట్టు కలిగిన జస్టిస్ చంద్రయ్య గారు నిష్పక్షపాత ధోరణి, క్రమశిక్షణ, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు.

న్యాయరంగంలో ఆయన చేసిన సేవలు ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు.

జస్టిస్ చంద్రయ్య గారి మృతి వార్త తనను వ్యక్తిగతంగా కూడా తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్న ఎంపీ ఈటల రాజేందర్, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

జస్టిస్ గుండ చంద్రయ్య అందించిన సేవలను తెలంగాణ ప్రజలు, న్యాయవాదులు, న్యాయరంగ ప్రముఖులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: మామిడి తోటలో అగ్నిప్రమాదం.
సోమవారం, రామసముద్రం మండలం, మినికి గ్రామంలో మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక...
By Kothuru Murali 2026-02-16 12:17:11 0 191
Telangana
జిహెచ్ఎంసి లో కలిపారు ! సమస్యలను గాలి కి వదిలిలేసారు ? మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా "జీవనది లా పారుతున్న మురుగు నీరు" పట్టించుకోని అధికారులు
మల్లంపేట డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా డ్రైనేజీ పొంగి  జీవనది పారుతున్న కానీ ,ఏ ఒక్కా అధికారులు...
By Ponnala Srinivasrao 2026-07-12 06:20:14 0 97
Andhra Pradesh
వంగవీటి మోహనరంగా కి ఘన నివాళులు
వంగవీటి మోహనరంగా కి ఘన నివాళులు బాపట్ల: ది 26-12-2025 వ తేదీ అనగా రేపు శుక్రవారం శ్రీ వంగవీటి...
By Gadiyapudi Narendra 2025-12-26 14:50:45 0 243
Andhra Pradesh
మదనపల్లె ఆసుపత్రి అధికారులపై చర్యలు.తీసుకోవాలి: బహుజన యువసేన
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకుల పట్ల సిబ్బంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారని...
By Pagadala Venkateswar 2026-02-06 14:27:43 0 176
Punjab
Government Launches Landmark Menstrual Health Drive in State Schools
The Punjab Government has initiated a pioneering, large-scale menstrual health education drive...
By Tejaswini Komanduru 2026-06-05 07:03:56 0 356
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com