తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

0
384

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ పరిధిలోని టేకుమట్ల మండలం గరిమెళ్లపల్లి, కలికోటపల్లి గ్రామాల నుండి పెద్ద ఎత్తున యువత తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరుపేద ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యం వంటి అంశాలను కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ప్రజల పక్షాన నిలబడి రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు కోసం కృషి చేస్తున్నారని తెలిపారు.తెలంగాణలోని బహుజన ప్రజలంతా పార్టీకి అండగా నిలుస్తున్నారని, ఈరోజు పార్టీలో చేరిన ప్రతి యువకుడు మరో 100 మందిని ప్రభావితం చేస్తూ భూపాలపల్లిలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. పార్టీ విధి విధానాలకు కట్టుబడి, పార్టీ ఆదేశాలను పాటిస్తూ ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీసి పేద ప్రజల కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పుప్పాల శ్రీను, దాసరపు వంశీ, దాసరపు శ్రావణ్, కొలనీ రమేష్‌లను రవి పటేల్ అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ పిట్టల వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, కొత్త మహేష్‌తో పాటు పార్టీ గ్రామ కమిటీ కార్యకర్తలు, నాయకులు మరియు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
Meghalaya
Meghalaya Schools Announce Mid-Term Break Schedule
As of July 1, 2026, schools across Meghalaya that completed their mid-term examinations by June...
By Lokeshwari Panthadi 2026-07-02 06:02:54 0 66
Telangana
కాలనీ పర్యటనలో కార్పొరేటర్ పాదయాత్ర.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని బృందావన్ కాలనీలోని బంగారు మైసమ్మ కాలనీ...
By Sidhu Maroju 2025-12-20 11:33:51 0 227
Andhra Pradesh
Chandrababu Naidu: అమరావతిలో మొదటిసారిగా రిపబ్లిక్ డే వేడుకలు... సీఎం చంద్రబాబు స్పందన.
అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు జరగడంపై సీఎం చంద్రబాబు హర్షం ఈ రిపబ్లిక్ డే ఏపీ ప్రజలకు...
By Pagadala Venkateswar 2026-01-26 11:12:52 0 304
Andhra Pradesh
జిల్లాలో 122 కొత్త పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు
ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి కోరారు....
By Boiena Rajesh 2026-02-27 02:11:53 0 174
Andhra Pradesh
చేపల వేటలో ప్రమాదం – వృద్ధుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో శనివారం జరిగిన సంఘటనలో, సిటిఎం ప్రాంతానికి చెందిన ఎర్రప్ప (60) అనే వృద్ధుడు చేపల...
By Pagadala Venkateswar 2026-03-22 06:11:34 0 281
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com