తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

0
386

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ పరిధిలోని టేకుమట్ల మండలం గరిమెళ్లపల్లి, కలికోటపల్లి గ్రామాల నుండి పెద్ద ఎత్తున యువత తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరుపేద ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యం వంటి అంశాలను కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ప్రజల పక్షాన నిలబడి రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు కోసం కృషి చేస్తున్నారని తెలిపారు.తెలంగాణలోని బహుజన ప్రజలంతా పార్టీకి అండగా నిలుస్తున్నారని, ఈరోజు పార్టీలో చేరిన ప్రతి యువకుడు మరో 100 మందిని ప్రభావితం చేస్తూ భూపాలపల్లిలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. పార్టీ విధి విధానాలకు కట్టుబడి, పార్టీ ఆదేశాలను పాటిస్తూ ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీసి పేద ప్రజల కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పుప్పాల శ్రీను, దాసరపు వంశీ, దాసరపు శ్రావణ్, కొలనీ రమేష్‌లను రవి పటేల్ అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ పిట్టల వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, కొత్త మహేష్‌తో పాటు పార్టీ గ్రామ కమిటీ కార్యకర్తలు, నాయకులు మరియు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
The Sentinel of Justice: The Unwavering Journey of Shri. Rachakonda Vishwanath
From the Classrooms of Ambition to the Frontlines of Public Service: A Story of Dedication,...
By Kalaga Sailaja 2026-07-14 10:56:49 0 49
Telangana
₹18 లక్షల సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన సబిత అనిల్ కిషోర్ గౌడ్ .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వెంకటాపురం డివిజన్ లోని కనాజిగూడ శ్రీనివాస కాలనీలో స్థానిక...
By Sidhu Maroju 2026-02-08 13:39:35 0 193
Andhra Pradesh
అసెంబ్లీని కొడవలివారిపాలెం విద్యార్థులు పర్చూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఏలూరితో ముచ్చట్లు...
పర్చూరు: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని కొడవలివారిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్‌కు...
By Gadiyapudi Narendra 2026-03-05 18:11:41 0 537
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మంత్రులను కలిసిన ఏఎంసీ చైర్మన్
బుధవారం అమరావతిలో రాష్ట్ర రేవున్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను అన్నమయ్య జిల్లా,...
By Kothuru Murali 2026-02-26 12:35:09 0 126
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జూన్ 2న సీఎం శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో సభాస్థలాన్ని పరిశీలించిన మాజీ డీసీసీ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు
🎤కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): కొమురం భీం...
By Chunarkar Jagadeesh 2026-05-23 07:23:29 0 543
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com