అధికారం, హోదా, ప్రభావం, స్థానం ఏదైనా సరే… చట్టం ముందు అందరూ సమానమే ... మంచు మనోజ్

0
71

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై నటుడు మంచు మనోజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.""

‎ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సోషల్ మీడియాలో స్పందించారు.

‎ప్రతి మైనర్ బాలికకు న్యాయం జరగాలని, అందుకోసమే #POCSO చట్టం రూపొందించబడిందని పేర్కొన్నారు.

‎అధికారం, హోదా, ప్రభావం, స్థానం ఏదైనా సరే… చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు.

‎మైనర్లకు సంబంధించిన కేసుల్లో అత్యవసరంగా, పారదర్శకంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

‎ఆలస్యం, మౌనం లేదా సెలెక్టివ్ చర్యలు ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు.

‎ఇది రాజకీయాలు లేదా వ్యక్తుల గురించి కాదు… నిజం బయటకు రావడం, న్యాయం జరగడమే ముఖ్యమన్నారు.

‎ఎలాంటి ఒత్తిళ్లు, ప్రభావాలు లేకుండా నిష్పక్షపాత విచారణ జరపాలని కోరారు.

‎“Justice must not only be done but also seen to be done” అంటూ చట్టం ముందు ఎవరూ అతీతులు కాదని పేర్కొన్నారు.

‎తెలంగాణ ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులను ట్యాగ్ చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నేతాజీ జయంతికి నాయకుల ఘన నివాళి.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకొని నాయకులు, ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు...
By Pagadala Venkateswar 2026-01-23 07:03:30 0 135
Andhra Pradesh
విజయనగరంలో రేపు జాబ్ మేళా..
విజయనగరం MR కాలేజీలో ఈనెల 17న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా గురువారం...
By Boiena Rajesh 2026-04-16 13:54:14 0 129
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి తిరుపతి తరహా ప్రసాదాలు తయారీ
పత్రికా ప్రకటన   ఇంద్రకీలాద్రి,28 జనవరి 2026   తిరుమల తరహాలో 'దుర్గమ్మ' ప్రసాదాల...
By Rajini Kumari 2026-01-28 13:09:57 0 166
Telangana
సందిగ్ధంలో అజారుద్దీన్ మంత్రి పదవి.|
హైదరాబాద్ : ఎమ్మెల్సీ కేసు పెండింగ్‌లో ఉండగా, కోర్టు తీర్పుపై ఆధారపడి ఉన్న అజారుద్దీన్...
By Sidhu Maroju 2025-12-26 09:42:04 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com