అధికారం, హోదా, ప్రభావం, స్థానం ఏదైనా సరే… చట్టం ముందు అందరూ సమానమే ... మంచు మనోజ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసుపై నటుడు మంచు మనోజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.""
ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సోషల్ మీడియాలో స్పందించారు.
ప్రతి మైనర్ బాలికకు న్యాయం జరగాలని, అందుకోసమే #POCSO చట్టం రూపొందించబడిందని పేర్కొన్నారు.
అధికారం, హోదా, ప్రభావం, స్థానం ఏదైనా సరే… చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు.
మైనర్లకు సంబంధించిన కేసుల్లో అత్యవసరంగా, పారదర్శకంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
ఆలస్యం, మౌనం లేదా సెలెక్టివ్ చర్యలు ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు.
ఇది రాజకీయాలు లేదా వ్యక్తుల గురించి కాదు… నిజం బయటకు రావడం, న్యాయం జరగడమే ముఖ్యమన్నారు.
ఎలాంటి ఒత్తిళ్లు, ప్రభావాలు లేకుండా నిష్పక్షపాత విచారణ జరపాలని కోరారు.
“Justice must not only be done but also seen to be done” అంటూ చట్టం ముందు ఎవరూ అతీతులు కాదని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులను ట్యాగ్ చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz