10వ తరగతి పాసైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు పంపిణీ

0
107

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు  కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని,ఇటీవల వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచాయని సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు వాసిరెడ్డి ప్రసాద్ అన్నారు.చందర్లపాడు మండలం కోనాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతిలో 31మంది విద్యార్థులకు గాను 30 మంది విద్యార్థులు పాస్ అయినారు.సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు వాసిరెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో 30 మంది పదవ తరగతి పాసైన విద్యార్థులకు సీల్డ్ తో పాటు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున నగదు ప్రోత్సకాలను సోమవారం సొసైటీ బ్యాంకు లో అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కఠోర దీక్ష,నిరంతర సాధనను అలవర్చుకొని చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు.చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.విద్యార్థుల ఎదుగుదలలో కుటుంబం,కుటుంబాల ఎదుగుదలలో దేశం ఉండాలని కోరారు.ఏ కార్యక్రమంలో సొసైటీ బ్యాంక్ సిబ్బంది,స్కూల్ చైర్మన్ మార్కపూడి జాన్ కోటయ్య,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
"Growing Concerns Over Declining Credibility in Digital Journalism.|
Hyderabad: Concerns are increasingly being raised over the declining standards of journalism and...
By Sidhu Maroju 2026-05-14 12:51:33 0 117
Andhra Pradesh
రిపోర్టర్ పేరుతో అధికారులను బెదిరించిన యువకుడు.
మదనపల్లెలో సోమవారం ఉదయం ఓ యువకుడు రిపోర్టర్ పేరుతో రవాణా శాఖ అధికారులను బెదిరించిన ఘటన కలకలం...
By Pagadala Venkateswar 2026-03-16 07:05:40 0 128
Andhra Pradesh
జిల్లా లో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్న పోలీసులు
కర్నూలు : కర్నూలు జిల్లా...నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని  రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్...
By Hari Krishna 2026-01-04 10:38:59 0 177
Andhra Pradesh
మదనపల్లి ఘటన చిన్నారి రిషిక అంత్యక్రియలకు హాజరైన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు మదనపల్లి బాధితురాలు చిన్నారి రిషిక అంత్యక్రియలకు హాజరైన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం...
By Benguluri Madhubabu 2026-02-18 10:22:18 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com