లక్షేటిపేట వద్ద వడ్ల కొనుగోలు కేంద్రం, ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

0
209

మంచిర్యాల జిల్లా లక్షెట్‌పేట్ సమీపంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు. ఇటీవల గోడ కూలిన ప్రమాదం జరిగిన స్థలాన్ని కూడా పరిశీలించి, అక్కడి పరిస్థితులను రైతులతో నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన ఎంపీ, కలెక్టర్‌తో కలిసి కేంద్రాన్ని పరిశీలించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే లారీలు, ట్రాక్టర్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. వడ్లలో అనవసర కటింగ్లు జరగకుండా మిల్లర్లతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా సాగి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పదో తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందించిన కాసిం, ఈశ్వర్
పదో తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందించిన కాసిం, ఈశ్వర్ పెద్దారవీడు మండలం ...
By Chennaiah Kati 2026-03-14 06:12:45 0 361
Telangana
చందానగర్ లో 19 ఏళ్ల విద్యార్థిని అదృశ్యం
మొయినాబాద్:మొయినాబాద్ మండలంలోని చందానగర్ గ్రామ నివాసి తోక బార్గవి (19), విద్యార్థిని అదృశ్యమైంది....
By Veeresh Kumar 2026-04-01 04:50:33 0 571
Andhra Pradesh
క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ 'పల్లె నిద్ర' పర్యటన
క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ 'పల్లె నిద్ర' పర్యటన టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో 'పల్లె...
By Chennaiah Kati 2026-07-11 04:44:04 0 49
Andhra Pradesh
లోక్ అదాలత్ లో 90 కి పైగా కేసుల పరిష్కారం
*లోక్‌ అదాలత్‌లో 90కి పైగా కేసుల పరిష్కారం*    *మంగళగిరి రూరల్ ఎస్సై...
By Rajini Kumari 2025-12-24 08:05:42 0 191
Andhra Pradesh
చిన్నారులకు భోగి పండ్లు వైసీపీ నేతల ఆశీర్వాదాలు
చిన్నారులకు భోగి పండ్లు తో దీవించి వారిని ఆశీర్వదించిన వైకాపా నేత పోతిన వెంకట మహేష్ దంపతులు ...
By Rajini Kumari 2026-01-14 12:39:55 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com