ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడి.

0
95

ఏపీకి వచ్చిన ప్రముఖ మోటార్‌సైకిల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్

సత్యవేడులో రూ. 2,200 కోట్లతో భారీ తయారీ యూనిట్ ఏర్పాటు

తమిళనాడు వెలుపల సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి ప్లాంట్ ఇదే

ప్రాజెక్టు ద్వారా దాదాపు 5,000 ఉద్యోగాల కల్పన

పెట్టుబడికి ఆమోదం తెలిపిన ఏపీ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగానికి భారీ ఊతం లభించింది. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం, ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన నూతన తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనుంది. 1901లో సంస్థ ప్రారంభమైన నాటి నుంచి తమిళనాడు వెలుపల ఇంత భారీ స్థాయిలో విస్తరించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

 

తిరుపతి జిల్లా సత్యవేడులో ఈ అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కంపెనీ రెండు దశల్లో సుమారు రూ. 2,200 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ఆమోదం తెలిపింది. ఈ ప్లాంట్ ద్వారా రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ సామర్థ్యం దాదాపు 9 లక్షల యూనిట్లు పెరగనుంది.

 

ఈ ప్రాజెక్టు కోసం సత్యవేడు మండలంలోని వన్నెలూరు (233.76 ఎకరాలు), రాళ్ళకుప్పం (42.38 ఎకరాలు) గ్రామాల్లో ప్రభుత్వం మొత్తం 267 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొదటి దశలో ప్రధాన తయారీ యూనిట్‌తో పాటు, ఒక ప్రత్యేక వెండర్ పార్క్‌ను కూడా అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల సంస్థకు చెందిన సరఫరాదారులు కూడా ఏపీకి తరలివచ్చి, రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఆటోమోటివ్ తయారీ క్లస్టర్ ఏర్పడటానికి దోహదపడుతుంది. మొదటి దశ 2029 నాటికి, రెండో దశ 2032 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

ఈ పరిణామంపై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ హర్షం వ్యక్తం చేశారు. "రాయల్ ఎన్‌ఫీల్డ్ కేవలం ఒక మోటార్‌సైకిల్ బ్రాండ్ కాదు, అది వారసత్వం, నాణ్యతకు ఒక ప్రతీక. ఇంతటి ఐకానిక్ కంపెనీని ఏపీకి స్వాగతిస్తున్నందుకు గర్వంగా ఉంది. వ్యాపార నిర్వహణలో ఏపీ వేగం, ఇక్కడి మౌలిక సదుపాయాలకు ఈ పెట్టుబడి నిదర్శనం. ఈ ప్లాంట్‌తో పాటుగా వచ్చే అనుబంధ పరిశ్రమలతో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి ఆటోమొబైల్, అడ్వాన్స్‌డ్ మానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న మా లక్ష్యం మరింత బలపడుతుంది" అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతం కానుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ బలగం బలం
*మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలి*   *తెలుగుదేశం పార్టీ బలం, బలగం...
By Rajini Kumari 2026-01-27 11:46:31 0 195
Andhra Pradesh
Anna Lezhneva: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా.
అన్నా లెజినోవాకు ఘన స్వాగతం పలికిన ధర్మకర్తలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అన్నా...
By Pagadala Venkateswar 2026-02-03 13:12:11 0 146
Andhra Pradesh
ఏపీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ లకు వారాంతపు సెలవులు ఇవ్వాల్సిందే ఆంధ్రప్రదేశ్ స్ట్ర గుల్ కమిటీ ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ కృష్ణాజిల్లా
పత్రికా ప్రకటన! ఏపీ.కాంట్రాక్టుస్టాఫ్ నర్స్ లకు వారంతపు సెలవులు ఇవ్వాల్సిందే --- ఆంధ్రప్రదేశ్...
By Rajini Kumari 2025-12-16 07:19:47 0 194
Odisha
Odisha's ₹90,000 Crore Railway Infrastructure Boost
Odisha is currently undergoing a massive transformation in its railway connectivity, with...
By Lokeshwari Panthadi 2026-07-02 07:38:55 0 69
Andhra Pradesh
విజయవాడ దుర్గ గుడిలో వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్కు రాచ మర్యాదలు
**దుర్గగుడిలో వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుకు రాస మర్యాదలు చేసిన చైర్మన్ బుర్ర...
By Rajini Kumari 2026-04-23 12:24:18 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com