విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. మోదీ, చంద్రబాబుకు లోకేష్ ధన్యవాదాలు.

0
62

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై గెజిట్ విడుదల

ఏపీ చిరకాల ఆకాంక్ష నెరవేరిందన్న మంత్రి నారా లోకేశ్

ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కృతజ్ఞతలు

సీఎం చంద్రబాబు నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందని వెల్లడి

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, కనెక్టివిటీలో ఒక చారిత్రక ఘట్టమని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిన ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలు గణనీయంగా బలపడతాయని, రైళ్ల నిర్వహణ సామర్థ్యం కూడా పెరుగుతుందని లోకేష్ పేర్కొన్నారు. ఈ మైలురాయి ద్వారా ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం అవుతుందని, కనెక్టివిటీ మెరుగుపడి ప్రజలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ఈ రైల్వే జోన్ ఏర్పాటును సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేశారని నారా లోకేష్ గుర్తుచేశారు. ఆయన పట్టుదల వల్లే ఈ కల నెరవేరిందని, ఇందుకుగాను ముఖ్యమంత్రికి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు లోకేష్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

Search
Categories
Read More
Bharat Aawaz
మీడియా మూగబోయిందా?
https://youtu.be/AkEiqPBhFko
By Hazu MD. 2025-08-21 04:25:13 0 1K
Telangana
ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి.
Alert… ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ ఫోటోలలో ఉన్న దొంగలు...
By Ponnala Srinivasrao 2026-05-03 16:53:32 0 72
Andhra Pradesh
హెల్మెట్ లేకపోతే ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ పోయేవొద్దండి !!
కర్నూలు : ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయెద్దు ...కర్నూలు డిఎస్పీ శ్రీ జె....
By Hari Krishna 2025-12-26 16:37:49 0 188
Andhra Pradesh
అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడేషన్లు
అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడేషన్లను మంజూరుచేస్తామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు....
By Boiena Rajesh 2026-03-02 14:48:45 0 142
Andhra Pradesh
మదనపల్లెలో C, D గ్రేడ్ విద్యార్థుల 30 రోజుల విద్యా ప్రణాళిక.
అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ సుబ్రహ్మణ్యం సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, మదనపల్లి...
By Pagadala Venkateswar 2026-02-10 04:29:19 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com