"నేరేడ్మెట్, కౌకూర్-యాప్రాల్‌లో BRS హై వోల్టేజ్ మీటింగ్స్.|

0
223

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశాలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి.

188 నేరేడ్మెట్, 189 కౌకూర్-యాప్రాల్ డివిజన్‌లలో జరిగిన ఈ సమావేశాలకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ నందికంటి శ్రీధర్ సహా పలువురు కీలక నాయకులు పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. పార్టీ బలోపేతానికి సంస్థాగత ఎన్నికలు కీలకమని పేర్కొన్న ఎమ్మెల్యే, డివిజన్ స్థాయి కమిటీలను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని సూచించారు. 

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించి, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేకంగా SIR (Special Intensive Revision) ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించి ఓటర్ల హక్కులను కాపాడాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి అభివృద్ధి పనులు సాధిస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు.

పార్టీ సభ్యత్వ రుసుములను ప్రకటిస్తూ సాధారణ సభ్యత్వం రూ.10, క్రియాశీలక సభ్యత్వం రూ.50గా నిర్ణయించినట్లు తెలిపారు.

సమావేశాల్లో కార్యకర్తల అభిప్రాయాలను శ్రద్ధగా విన్న ఆయన, వాటిని గౌరవిస్తూ తగిన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అదేవిధంగా నేరేడ్మెట్‌కు చెందిన యువ నాయకుడు సుమన్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో హాజరై సమావేశాలను విజయవంతం చేశారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ నగరం లో డివైడర్ల లో ఎండిపోయిన చెట్లకు నీరు పోసిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే...
By Sadaq Sadaq 2026-06-02 12:56:34 0 117
Telangana
కన్న తల్లిదండ్రులనే క్షోభ పెట్టే కవితక్క ఎట్లా పరాయి వాళ్లకు 'అమ్మ 'అయితది ?
కొత్త పేరు పెట్టుకునే ధైర్యం లేదు… ‎కానీ “కొత్త రాజకీయ శక్తి” అంటూ...
By Ponnala Srinivasrao 2026-04-26 02:36:38 0 120
Telangana
రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత.|
"ఒడిశా నుంచి నాగ్‌పూర్‌కు తరలిస్తున్న రూ.20.56 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. ఇద్దరు...
By Sidhu Maroju 2026-07-06 10:28:07 0 74
Telangana
🗳️ గ్రామాభివృద్ధికి ఓటుతో మార్గం! – తెలంగాణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో
గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే కేవలం ఓట్ల పండుగ కాదు – ఇది గ్రామ ప్రజల చేతిలో అభివృద్ధికి...
By Pulse 2025-06-25 10:04:17 0 1K
Telangana
శ్రీ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ ఈటెల రాజేందర్
మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక బోనాల పండుగ.. ఆషాఢ మాసంలో తొలి బోనం ను గోల్కొండ లోని శ్రీ...
By Sidhu Maroju 2025-06-26 12:38:56 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com