తిరుమలలో పెరిగిన రద్దీ.. ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు.

0
67

 

తిరుమలలో పెరిగిన రద్దీ.. ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు

03-05-2026 Sun 19:24 | Both States

Tirumala Overcrowded Queues Extend to ATGH

వారాంతం కావడంతో తిరుమల కొండపై రద్దీ

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం

శనివారం 91,005 మందికి శ్రీవారి దర్శనం

హుండీ ద్వారా రూ. 3.37 కోట్ల ఆదాయం

వారాంతం కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇవాళ ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూలైన్లు వెలుపల ఏటీజీహెచ్ వరకు విస్తరించాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 16 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.

 

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించిన వివరాల ప్రకారం, శనివారం (మే 2) ఒక్కరోజే 91,005 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 36,257 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లుగా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే దర్శనానికి వచ్చిన భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

 

భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో టీటీడీ అధికారులు క్యూలైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. దర్శనానికి ఎక్కువ సమయం పడుతున్నందున, భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసిన నడిపించిన తాడేపల్లి పోలీసులు.
 *గుంటూరు జిల్లా పోలీస్...* *తాడేపల్లి పోలీస్ స్టేషన్...* *ది.25.12.2025* _*//ఆటో డ్రైవర్...
By KOTESWARARAO KVSR 2025-12-25 12:23:57 0 216
Uttar Pradesh
यूपी में सितंबर की कम बारिश से खेती और किसानों पर गहरा संकट
इस साल सितंबर में #उत्तरप्रदेश की बारिश सामान्य से बेहद कम रही है। इसका सीधा असर #धान और #गन्ना...
By Pooja Patil 2025-09-13 04:39:11 0 171
Andhra Pradesh
స్టేట్ మీడియా అక్రిడిటేషన్ జీవోను తక్షణమే రద్దు చేయండి
స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ జీవోను తక్షణమే రద్దు చేయండి.: సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి...
By Rajini Kumari 2025-12-23 09:52:41 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com