జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు.

0
89

 

జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు

04-05-2026 Mon 07:39 | Both States

Chandrababu Naidu Congratulates JEE Mains Toppers

100 పర్సంటైల్ సాధించిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు

ఉండవల్లిలో ముఖ్యమంత్రిని కలిసిన టాపర్లు, సంస్థ డైరెక్టర్లు

నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని కూడా ప్రశంసించిన సీఎం

జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ పరీక్షలో 100 పర్సంటైల్ సాధించి టాపర్లుగా నిలిచిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు నిన్న రాత్రి ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

 

వివరాల్లోకి వెళ్తే, నారాయణ విద్యాసంస్థల్లో చదివి 100 పర్సంటైల్ సాధించిన మహిత్ ఆంధ్రప్రదేశ్‌లో టాపర్‌గా నిలిచారు. అలాగే తెలంగాణ నుంచి సాయి రిత్విక్‌రెడ్డి, మహేశ్వరి, భవితేష్‌రెడ్డి టాపర్లుగా నిలిచారు. ఈ విద్యార్థులతో పాటు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు కె. పునీత్, గంటా రవితేజ, పి. సింధూర, శరణి కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

 

ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ తెలుగు విద్యార్థుల ప్రతిభను చాటుతున్న నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని, సిబ్బందిని కూడా ముఖ్యమంత్రి అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా రంజాన్ సందర్భంగా300 మందికి అన్నదానం షేక్ షేక్షావలి సేవ స్పూర్తి ప్రశంసనీయం
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం   దోర్నాల మండలంలో గత నాలుగు...
By Chennaiah Kati 2026-02-27 13:52:34 0 203
Telangana
అల్వాల్ కార్ వాషింగ్ సెంటర్లో అర్ధరాత్రి చోరీ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ABN కార్ వాషింగ్ సెంటర్లో...
By Sidhu Maroju 2026-02-17 15:51:49 0 219
BMA
Global Safety Initiative Launched to Protect Conflict Reporters
Following a sharp rise in targeted violence against the press, international media watchdogs...
By Dunna Jessicaruth 2026-05-20 05:52:45 0 117
Jammu & Kashmir
Reviving Mohra: Modernizing India’s Heritage Power Plant
The heritage Mohra Hydroelectric Power Project, established in the early 1900s as one of India's...
By Lokeshwari Panthadi 2026-06-29 09:39:09 0 70
Andhra Pradesh
విధుల్లోకి డిప్యూటీ సీఎం పవన్.. నేడు అమరావతికి.
శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న డిప్యూటీ సీఎం పవన్ మూడు వారాల విశ్రాంతి తర్వాత నేడు మంగళగిరికి...
By Pagadala Venkateswar 2026-05-13 06:02:40 0 78
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com