టీడీపీ మే డే వేడుకలు: కార్మికులకు వరాలు.. గత ప్రభుత్వంపై నేతల ఫైర్.

0
89

 

టీడీపీ మే డే వేడుకలు: కార్మికులకు వరాలు.. గత ప్రభుత్వంపై నేతల ఫైర్

01-05-2026 Fri 22:25 | Andhra

TDP organises May Day celebrations

టీడీపీ కార్యాలయంలో ఘనంగా మే డే వేడుకలు

భవన నిర్మాణ కార్మికులకు రద్దయిన పథకాలను పునరుద్ధరిస్తామని ప్రకటన

15 నగరాల్లో 'ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమినిటీస్ సెంటర్లు' ఏర్పాటుకు నిర్ణయం

గత వైసీపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించిందని నేతల విమర్శలు

అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ పోర్టల్‌తో రూ.20 లక్షల వరకు బీమా సాయం

అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మే డే వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పలు కీలక ప్రకటనలు చేశారు. భవన నిర్మాణ కార్మికుల కోసం గత ప్రభుత్వం రద్దు చేసిన అన్ని సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తున్నామని, కార్మికులు పనుల కోసం రోడ్లపై వేచి చూడకుండా 15 ప్రధాన నగరాల్లో 'ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమినిటీస్ సెంటర్లు' (లేబర్ అడ్డాలు) ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

 

ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్మిక పక్షపాతి అని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు రోజుకు 18 గంటలు పనిచేసే 'ప్రధాన కార్మికుడు' అని కొనియాడారు. అసంఘటిత రంగ కార్మికులు ఈ-శ్రమ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే ప్రమాద బీమా కింద రూ. 20 లక్షల వరకు సాయం అందుతుందని తెలిపారు. రాష్ట్రంలో కొత్త ఈఎస్ఐ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

 

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అడ్వైజరీ కమిటీ ఛైర్మన్‌ గొట్టుముక్కల రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. జగన్ పాలనలో పరిశ్రమలు తరలిపోయి ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు విమర్శించారు. దేశంలో కార్మిక హక్కులకు డాక్టర్ బీఆర్ అంబేడ్కరే పునాదులు వేశారని ఆయన గుర్తుచేశారు.

 

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు మాట్లాడుతూ, అధికార పార్టీలో యూనియన్ నడపడం 'కత్తి మీద సాము' లాంటిదని, కార్మికుల హక్కుల విషయంలో రాజీ పడొద్దని మంత్రికి సూచించారు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ, కార్మికులు సుఖంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు.

 

ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ జెండాను మంత్రి సుభాష్ ఆవిష్కరించారు. అనంతరం నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీనియర్ నాయకులు, కార్మికులను సత్కరించారు.

Search
Categories
Read More
West Bengal
Cabinet Approves 7th Pay Commission For State Staff
In a major relief for state employees, the West Bengal cabinet, chaired by Chief Minister Suvendu...
By Dunna Jessicaruth 2026-05-18 10:49:37 0 87
Andhra Pradesh
పుంగనూరు: జాతీయ రహదారిపై స్థానికుల నిరసన
పుంగనూరు బెంగళూరు జాతీయ రహదారిపై సోమవారం స్థానిక ప్రజలు నిరసన తెలిపారు. పుంగనూరు-ముళ బాగిల్...
By Kothuru Murali 2026-04-07 05:39:12 0 167
SURAKSHA
Andhra Pradesh Police Implements Community Service Sentences for Minor Offenses
Many minor offenders, especially first-timers or youth, often struggle to find employment after...
By Kalaga Sailaja 2026-06-30 12:32:10 0 97
Andhra Pradesh
పుంగనూరు:గంగమ్మ వీడియో వైరల్
పుంగనూరు చరిత్ర, శ్రీసుగుటూరు గంగమ్మ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఓ వీడియోను సినీ నటుడు సప్తగిరి...
By Kothuru Murali 2026-02-22 11:00:04 0 154
Assam
Assam's Solar Leap: 17% Families Pay Zero Power Bills
Assam Chief Minister Himanta Biswa Sarma announced a major milestone in the state's green...
By Lokeshwari Panthadi 2026-06-26 13:02:22 0 53
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com