"మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో సందడి: రిటైర్డ్ అధికారులకు సీపీ ఆదేశాలతో ఘన గౌరవం.|

0
185

మేడ్చల్ మల్కాజిగిరి : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘ కాలం పాటు క్రమశిక్షణతో, అంకితభావంతో సేవలు అందించిన ముగ్గురు పోలీస్ అధికారులు నేడు పదవీ విరమణ పొందారు. 

పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కమిషనరేట్ కార్యాలయంలో ఈ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. 

పదవీ విరమణ పొందిన వారిలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ సబ్ ఇన్స్పెక్టర్ కె. కరుణాకర్ రెడ్డి, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ హెచ్. బండయ్య మరియు ఆర్మ్డ్ హెడ్ క్వార్టర్స్‌లో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన బి. కిష్టయ్యలు ఉన్నారు.

ఈ సందర్భంగా మల్కాజిగిరి అడ్మిన్ డీసీపీ శివ కుమార్ మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎదురయ్యే ఎన్నో ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఇన్నేళ్ల పాటు శాఖకు సేవలు అందించడం గర్వకారణమని కొనియాడారు. 

వారి క్రమశిక్షణను అభినందిస్తూ భవిష్యత్తులో వారు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సీఏఓ అడ్మిన్ శ్రీనివాస్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అశోక్ రెడ్డి, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్. భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ నాయుడు, కో ఆపరేటివ్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, ట్రెజరర్ బాలరాజు, డైరెక్టర్లు సువర్ణ, వల రాజు తదితర పోలీస్ సిబ్బంది పాల్గొని పదవీ విరమణ పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
AP SSC Hall Tickets: ఏపీలో టెన్త్ హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్.. ఇక పరీక్షా కేంద్రం వెతకడం ఈజీ!
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సులభంగా పరీక్షా కేంద్రం గుర్తింపు విద్యార్థుల ఇబ్బందుల నివారణకు...
By Pagadala Venkateswar 2026-03-09 08:09:58 0 134
Andhra Pradesh
చీటీల్లో రూ. 1. 30 కోట్లు నష్టం – ఎస్పీకి బాధితుల ఫిర్యాదు.
మదనపల్లిలో చీటీల పేరుతో సుమారు రూ. 1.30 కోట్ల మేర నష్టం జరిగినట్లు బాధితులు సోమవారం అన్నమయ్య...
By Pagadala Venkateswar 2026-02-02 12:17:22 0 144
Andhra Pradesh
పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ మౌనిక హెచ్చరిక
పెద్దాపురంలో స్కూల్ బస్సులు, ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులు, ప్రయాణికులను ఎక్కించుకుంటే...
By Ratna Sekhar 2026-02-14 14:58:50 0 357
Andhra Pradesh
మదనపల్లి: రూ. 2. 5 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ
మంగళవారం మదనపల్లి పట్టణంలో రూ. 2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే...
By Pagadala Venkateswar 2026-01-15 07:44:43 0 180
Rajasthan
Rajasthan Strengthens Healthcare and Medical Services
Rajasthan continues to strengthen its healthcare system through the expansion of medical...
By Fathima Safa 2026-06-30 12:23:34 0 58
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com