సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు.. అభినందించిన పవన్ కల్యాణ్.

0
104

సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డు

ప్రముఖ ఆర్థిక పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించిన పురస్కారం

ముంబైలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రధానం

ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఆర్థిక దినపత్రిక 'ది ఎకనామిక్ టైమ్స్' ఆయనను 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ - 2025' అవార్డుతో సత్కరించింది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో నిన్న జరిగిన 26వ ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.

 

పరిపాలనలో చేపట్టిన సంస్కరణలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడంలో చేసిన కృషికి గాను చంద్రబాబుకు ఈ గౌరవం దక్కింది. ముఖ్యంగా 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్', 'స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్' వంటి విధానాలను అమలు చేయడం, స్వల్పకాలంలోనే రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి హామీలను ఆకర్షించడంలో చూపిన చొరవను ఎకనామిక్ టైమ్స్ జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసించింది.

 

ఈ పురస్కారంపై ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. "చంద్రబాబు నాయకత్వ శైలి ఎంతో స్ఫూర్తినిస్తుంది. రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన అమలు చేస్తున్న పాలనా విధానాలు, పారిశ్రామికవృద్ధికి చేపడుతున్న సంస్కరణలు కచ్చితంగా సత్ఫలితాలనిస్తాయి. ఆయనకు దక్కిన ఈ అవార్డు రాష్ట్రమంతటికీ గర్వ కారణంగా భావిస్తున్నాను," అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
భద్రాచలం బస్టాండ్‌లో మహాలక్ష్మి పథకం సంబరాలు: పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు
భద్రాచలం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా...
By Lakavath Kiran 2026-03-31 12:58:54 0 423
Telangana
ఎమ్మెల్యే జిఎంఆర్ ను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి
ఇటీవల తన కార్యాలయంలో జారిపడి, స్వల్ప గాయాలకు గురై తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పటాన్చెరు...
By Ponnala Srinivasrao 2026-04-26 02:14:55 0 110
Andhra Pradesh
Mnrega పేరు మార్పు స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత చీకటి రోజు వైఎస్ షర్మిల రెడ్డి Apcc చీఫ్
Scroll    విజయవాడ    వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్    -...
By Rajini Kumari 2025-12-18 07:45:22 0 183
Business & Finance
Why an Indian Subsidiary Is Key to Business Expansion
An Indian subsidiary enables foreign businesses to establish a strong legal presence in India...
By Navya Sree 2026-07-18 05:21:39 0 38
Andhra Pradesh
తునికి ఆకు బోనస్ వెంటనే చెల్లించాలి: చింతూరు సిపిఎం కార్యకర్తల నిరసన!
2020-21 సంవత్సరానికి సంబంధించిన తునికాకు బోనస్ డబ్బులు ఇప్పటికీ కార్మికుల ఖాతాల్లో పడలేదు. దీనిపై...
By Shyamala Yadagiri 2026-06-02 06:45:34 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com