ఆటోని కారు ఢీకొన్న ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి

0
263

ఆటోని కారు ఢీకొన్న సంఘటనలో మహిళతో సహా ఇరువురి మృతి..

నందిగామ ఎన్టీఆర్ జిల్లా 

ఆటోని కారు ఢీకొన్న సంఘటనలో ఇరువురు మృతి చెందిన దుర్ఘటన కంచికచర్ల చెరువు కట్ట దాటిన తర్వాత 65 నెంబర్ జాతీయ రహదారిపై మిశ్రా దాబా వద్ద శనివారం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆటో డ్రైవర్ తో సహా ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళ మృతి చెందింది. కంచికచర్ల మండలం కీసర గ్రామం నుండి ఎస్ కే బాబు అనే వ్యక్తి ఆటో సర్వీస్ చేసుకుంటూ కంచికచర్ల వచ్చాడు. కీసర తిరుగు ప్రయాణంలో ఆటోలో అరటి గెలలు వేసుకొని వెళ్తుండగా కంచికచర్ల గ్రామంలోని ప్రణీత కాలనీకి చెందిన పసుపులేటి కిట్టమ్మ నందిగామ వెళ్లేందుకు ఆటోలో ప్రయాణిస్తుండగా కంచికచర్ల శివారులో మిత్ర ఆక్సిన్ కంపెనీ దాటిన తర్వాత మిశ్రా దాబా వద్ద, నందిగామ వైపు వెళుతున్న ఇన్నోవా కారు ఆటోని వెనుక నుండి డీ కొనడంతో ఆటో పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ఎస్ కె బాబు(45) అక్కడికక్కడే మృతి చెందగా ఆటోలో ప్రయాణిస్తున్న పసుపులేటి కిట్టమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం మహిళను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రధమ చికిత్స అందించి, గాయాల తీవ్రత దృష్ట్యా మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ మేరకు కంచికచర్ల ఎస్ఐ పి. విశ్వనాథ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర కార్యదర్శి V శ్రీనివాసరావు ముఖ్యమంత్రి కి రాసిన లేఖ
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆంధ్ర ప్రదేశ్ కమిటీ విజయవాడ, విజయవాడ, తేది : 18...
By Rajini Kumari 2025-12-18 11:51:54 0 212
Business & Finance
Increase Authorised Capital the Right Way Today
Increasing authorised capital allows a company to issue additional shares and raise funds for...
By Navya Sree 2026-07-09 07:01:19 0 85
Telangana
Yellow Alert ఈ జిల్లాలో వర్షాలు..,
భారత్ అవాజ్ న్యూస్: 19 జూలై రోజున వాతావరణం శాఖ వెలువడించడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లోని పలు...
By Gujile Ramu 2026-07-19 00:32:44 0 57
Telangana
ఆగస్టు 5వ తేదీలోగా మిల్లరు బకాయిలు చెల్లించాలి.. :
mahabubabad: యాక్షన్ ప్యాడీ, సీఎంఆర్ బకాయి ఉన్న రైస్ మిల్లర్లు ఆగస్టు 5వ తేదీలోగా బకాయిలను...
By Bheeshman King 2026-07-08 12:33:20 0 450
Telangana
వెలుగు లేని పల్లె వెలుగు
కరీంనగర్ జిల్లా. సందర్భాన్ని బట్టి అయిన సౌకర్యాలు మెరుగుపరిచనీ ఆర్టీసీ సిబ్బంది పట్టించుకోని పై...
By Thalakokkula Sadanandam 2026-04-03 05:35:52 0 481
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com