చిత్తవుతున్న యువత వీధిన పడుతున్న కుటుంబాలు మద్యం మాఫియా పై జి కోటేశ్వరరావు ఆగ్రహం

0
166

 చిత్తవుతున్న యువత.. వీధిన పడుతున్న కుటుంబాలు: మద్యం మాఫియాపై :- 

జి కోటేశ్వరరావు ఆగ్రహం

 

 

విజయవాడ నగరంలో మద్యం ఏరులై పారుతోందని, మద్యం మాఫియా అరాచకాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలోని దాసరి భవన్‌లో కంచర్ల భార్గవ్ అధ్యక్షతన జరిగిన ఏఐవైఎఫ్ (AIYF) నగర ముఖ్య కార్యకర్తల సమావేశం లో జి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. నగరంలో మద్యం విక్రయాలు మితిమీరిపోవడం వల్ల ఎంతోమంది యువత ప్రాణాలు బలికావడమే కాకుండా, అనేక కుటుంబాలు చితికిపోయి వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. తక్షణమే మద్యం మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

నిరసన సెగ.. సమరశంఖం:

ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ, మాఫియాల అరాచకాలకు వ్యతిరేకంగా AIYF పోరాటాన్ని ఉధృతం చేస్తుందని ప్రకటించారు.

ఏప్రిల్ 30న నిరసన: మెడికల్ మాఫియాను అరికట్టాలనే డిమాండ్‌తో ఏప్రిల్ 30న విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి (GGH) వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు.

మే 3న జెండా ఆవిష్కరణ: AIYF 66వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మే 3న నగరంలోని అన్ని డివిజన్లలో ఘనంగా జెండా ఆవిష్కరణలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మద్యం, మెడికల్ మాఫియాలను అదుపు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీరం రవికుమార్, ఎస్. రాము, ఐ. ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, షైనీ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Bharat Aawaz
The Curious Scientist & the Whispering Plant: A Floral Mystery from the Amazon Jungle “When the jungle speaks, the flowers hide.”
In the heart of the vast Amazon rainforest, a curious discovery has stunned botanists and...
By Bharat Aawaz 2025-08-04 18:35:34 0 1K
Assam
Natural Gas Supply Expansion Strengthens Assam Growth
Assam is witnessing significant progress in its energy sector through the expansion of natural...
By Fathima Safa 2026-06-24 06:16:18 0 68
Telangana
ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఏప్రిల్ మూడో వారానికి వాయిదా!
ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఏప్రిల్ మూడో వారానికి వాయిదా! తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో...
By Pinnehasan Odela 2026-04-08 13:32:29 0 176
Andhra Pradesh
మార్కాపురం జిల్లా.... తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ని స్వచ్చందంగా పంపిణి చేసిన SEVAస్వచ్చంద సంస్థ
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష...
By Chennaiah Kati 2026-03-10 11:02:11 0 444
Andhra Pradesh
అక్షరాంధ్ర పరీక్షలకు శతశాతం హాజరు కావాలి: కలెక్టర్
ఈనెల 28న జరిగే అక్షరాంధ్ర ప్రీ-ఫైనల్ పరీక్షకు, మార్చి 15న నిర్వహించే ఫైనల్ పరీక్షకు నమోదు...
By Boiena Rajesh 2026-02-26 02:19:16 0 258
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com