బస్సు ఆపకుండా వెళ్ళిపోయినందుకు బస్సు డ్రైవర్ ని చెప్పుతో కొట్టిన మహిళ

0
147

*ఆర్టీసీ డ్రైవర్ పై చెప్పుతో కొట్టిన మహిళ.*

 

 

బస్సు ఆపలేదనే కారణంతో ఆర్టీసీ డ్రైవర్ పై మహిళ చెప్పుతో కొట్టిన ఘటన మోపిదేవిలో శుక్రవారం చోటు చేసుకుంది.

 

సేకరించిన వివరాల మేరకు అవనిగడ్డ నుంచి విజయవాడ వెళుతున్న కరకట్ట బస్సును పులిగడ్డ వంతెనపై మహిళ బస్సు ఎక్కడానికి ఆపింది. కానీ బస్సు ఆపకుండా డ్రైవర్ వెళ్లిపోయాడు. దీంతో మహిళ బస్సును వెంబడిస్తూ, మోపిదేవి ప్రధాన సెంటర్లో బస్సు ఎక్కి, డ్రైవర్ ను చెప్పుతో చెంప మీద కొట్టింది. అంతటితో ఆగని సదరు మహిళ తన బంధువులకు ఫోన్ చేసి చల్లపల్లి బస్ స్టాప్ కు పిలిపించి వారితో డ్రైవర్ ను కొట్టించింది. దీంతో బస్ స్టాప్ లో కొద్దిసేపు ఆర్టీసీ ఉద్యోగులు, మహిళకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

 

మహిళకు బంధువైన ఒక కానిస్టేబుల్ సదరు గొడవలో ఎంటరై, పంచాయితీ స్టేషన్ వరకు వెళ్లకుండా సర్దుబాటు చేశారు.

 

బస్సు ఆపనంత మాత్రాన డ్రైవర్ ను కొడతారా....... కొట్టిస్తారా....... అంటూ ఉద్యోగులు వాపోతున్నారు. చివరకు ఏమవుతుందో వేచి చూడవలసిందే.

Search
Categories
Read More
Telangana
New rules of Ration card.
కొత్త రేషన్ కార్డ్ నిబంధనలు 2026 కొత్త నిబంధనలు - ముఖ్యాంశాలు   కేంద్ర ప్రభుత్వం ప్రధాన్...
By G k Nookala 2026-03-05 10:34:37 0 130
Andhra Pradesh
మదనపల్లెలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై భారీ ర్యాలీ.
అన్నమయ్య జిల్లా యంత్రాంగం ఆదివారం మదనపల్లెలో ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ...
By Pagadala Venkateswar 2026-01-25 12:40:19 0 165
SURAKSHA
Karnataka Police Today: Green Warriors For Clean Earth
Today Karnataka police officers joined “Hasiru Karnataka” plantation drive. Over...
By Kalaga Sailaja 2026-07-04 06:41:44 0 31
Andhra Pradesh
సీఎం చంద్రబాబు గారి దిశా నిర్దేశంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా పూర్తయింది.
సీఎం చంద్రబాబు గారి దిశా నిర్దేశంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం...
By SivaNagendra Annapareddy 2026-01-05 05:49:37 0 618
Telangana
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్థిర ప్రతిష్ట : పాల్గొన్న ఎమ్మెల్యే
         మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మచ్చ బొల్లారం.  ...
By Sidhu Maroju 2025-08-10 16:18:13 0 755
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com