చీరాలలో ఉచిత మెగా కార్డియాక్ క్యాంప్, గుండె ఆరోగ్యంపై అవగాహన

0
174

చీరాల 

గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన పెంపొందించడంతో పాటు ముందస్తు నిర్ధారణ కోసం చీరాలలో మెగా కార్డియాక్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. కీ॥శే॥లు శ్రీజిత్ స్వరూప్ జ్ఞాపకార్థం బి.ఎన్.ఎస్ ఫ్యామిలీ ట్రస్ట్ ఆధ్వర్యంలో కడా కె.వై.కె. విజయ హాస్పిటల్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేయబడింది.

ఈ మెగా కార్డియాక్ క్యాంప్ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సిపాయిపేటలోని విశాల్ మార్ట్ సమీపంలో నిర్వహించనున్నారు. గుండె జబ్బుల ప్రమాదంలో ఉన్నవారికి ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

ప్రత్యేకంగా 30 సంవత్సరాల పైబడినవారు, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నవారు, ధూమపానం లేదా మద్యపానం చేసే వారు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు, అలాగే ఛాతినొప్పి, అయాసం, గుండె దడ వంటి లక్షణాలు ఉన్నవారు ఈ శిబిరాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఈ శిబిరంలో భాగంగా సీబీసీ , ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ (ఎఫ్ బి ఎస్ ), లిపిడ్ ప్రొఫైల్, కార్డియాక్ ఎంజైమ్ (సికె-ఎంబి ), ఈసీజీ (ఈసీజి ) వంటి పరీక్షలు, వైద్యుల సంప్రదింపులు పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. సుమారు రూ.2000 విలువ గల ఈ పరీక్షలను బి.ఎన్.ఎస్ ఫ్యామిలీ ట్రస్ట్ ఉచితంగా అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

“ముందస్తు గుర్తింపు ప్రాణాలను కాపాడుతుంది” అనే నినాదంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

శిబిరంలో పాల్గొనదలచిన వారు ముందస్తుగా 78423 76111, 78423 67111 నంబర్లకు సంప్రదించి నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి మార్కెట్లో తగ్గిన టమాటా ధరలు.
ఆసియాలోనే అతిపెద్దదైన మదనపల్లె టమోటా మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన...
By Pagadala Venkateswar 2026-02-27 09:07:40 0 106
Andhra Pradesh
జిల్లాలో 1,090 కేసులలో ₹11.88 కోట్ల ఆస్తి రికవరీ
2025లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,090 చోరీ కేసులు నమోదయ్యాయని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు....
By John Baji 2025-12-30 12:06:24 0 135
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి
పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్న...
By Kothuru Murali 2026-02-03 05:13:55 0 132
Andhra Pradesh
నకిలీ పత్రాలతో భూమి కబ్జా యత్నం: బాధితుల ఆరోపణలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, దిగువపల్లి పంచాయతీ బోయకొండ గంగాపురం ప్రాంతానికి చెందిన మోపురి పద్మ,...
By Pagadala Venkateswar 2026-04-08 12:46:58 0 100
Andhra Pradesh
చీరాల లో ఏసీబీ దాడులు
బాపట్ల జిల్లా చీరాలలో ఏసీబీ దాడులు నిర్వహించారు. గిద్దలూరు ఇన్చార్జి సబ్ రిజిస్టర్ గా పనిచేసిన...
By Vadlamudi NagaVenkat 2026-03-07 16:58:51 0 784
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com